బాలయ్య టాక్ షో లో కూడా మహేష్ బాబు ఎపిసోడ్ ఇప్పట్లో కష్టమేనా..?

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ తెలుగు ప్రముఖ ఓ టి టి ఆహా లో ఆన్ స్టాపబుల్ అనే ఒక టాక్ షో కు హోస్ట్  గా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, ఈ టాక్ షో  కు మొదటి గెస్ట్ గా మంచు మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి రాగా ఆ తర్వాత ఎపిసోడ్ కు నాచురల్ స్టార్ నాని గెస్ట్ గా వచ్చాడు. ఆ తర్వాత బాలకృష్ణ చేతికి సర్జరీ కావడంతో కొంత కాలం పాటు ఈ టాక్ షో కు దూరం అయ్యారు, ఆ తర్వాత తెలుగు ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం, తెలుగు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ షో కు గెస్ట్ లుగా వచ్చారు.  అయితే ఆ తర్వాత ఈ టాక్ షో కు సంబంధించి మహేష్ బాబు తో ఎపిసోడ్ ను షూట్ చేశారు, అయితే ఎంతో మంది అభిమానులు తర్వాత ఎపిసోడ్ ఇదే అని ఆశలు పెట్టుకున్నారు, కాకపోతే అనూహ్యంగా అఖండ సినిమా యూనిట్ కు సంబంధించిన ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేశారు, ఆ తర్వాత అయినా మహేష్ బాబు ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది అని బాలకృష్ణ అభిమానులతో పాటు మహేష్ బాబు అభిమానులు కూడా ఎదురు చూశారు.

 అయితే తాజాగా  తర్వాత ఎపిసోడ్ కు రాజమౌళి, కీరవాణి రానున్నట్లు ఆహా నిర్వహణ బృందం కన్ఫామ్ చేసింది, ఇందుకు సంబంధించిన ప్రోమో ను కూడా ఆహా నిర్వహణ బృందం విడుదల చేసింది.  అయితే రాజమౌళి, కీరవాణి ఎపిసోడ్ తర్వాత కూడా మహేష్ బాబు ఎపిసోడ్ స్ట్రీమింగ్ కావడమే కష్టం అని తెలుస్తోంది, రాజమౌళి, కీరవాణి ఎపిసోడ్ తర్వాత రవి తేజ ఈ టాక్ షో కు రాబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే మహేష్ బాబు ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: