వారెవ్వా.. ఆ రెండు థియేటర్లలో పుష్ప ప్రీమియర్లు..!

shami
మరో రెండు రోజుల్లో తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు నేషనల్ వైడ్ గా పుష్ప సందడి రాబోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో ఈసారి లెక్కకు మించిన సినిమాతో వస్తున్నారు. ఆర్య, ఆర్య 2 సినిమాలకు ఏమాత్రం సంబంధం లేని పుష్ప సినిమా థియేటర్ లను దద్దరిల్లిపోయేలా చేస్తున్నారు. బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
ఇక పుష్ప సినిమా యూఎస్ లో రిలీజ్ ముందు రోజే భారీ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తుండగా తెలుగు రెండు రాష్ట్రాల్లో మొదట ఆ రెండు థియేటర్లలోనే వస్తుందని తెలుస్తుంది. కూకట్ పల్లి మల్లికార్జున, భ్రమరాంభిక థియేటర్లలోనే పుష్ప ఫస్ట్ ప్రీమియర్ షో పడుతుందని తెలుస్తుంది. అది కూడా రిలీజ్ రోజు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు ఈ షో పడుతుందని అంటున్నారు. ఇప్పటికే ఈ షోకి సంబందించిన టికెట్లు కూడా సేల్ అయినట్టు టాక్.
బన్నీ నట విశ్వరూపంతో వస్తున్న పుష్ప సినిమా ముందు తామే చూడాలని ఫ్యాన్స్ ఎక్సయిట్ అవుతున్నారు. హైదరాబాద్ లో బెనిఫిట్ షోస్ దాదాపు కన్ ఫర్మ్ కాగా మిగతా ఏరియాల్లో ఇంకా డిసైడ్ అవ్వాల్సి ఉంది. మరోపక్క పుష్ప మేకర్స్ తెలంగాణాలో సినిమాను ఐదు షోలు వేసేలా పర్మిషన్ తీసుకునే ఆలోచనలో ఉన్నారు. వారం పాటు 5 షోలు వేస్తే కలక్షన్స్ అదిరిపోతాయని వారి లెక్క. పుష్ప సినిమా 250 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వస్తుంది. సినిమా హిట్ టాక్ వస్తే మాత్రం 500 కోట్ల పైన వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. రష్మిక మందన్న కథానాయికగా నటించిన పుష్ప సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ చెలరేగిపోయి మ్యూజిక్ అందించాడు. అందుకే సినిమా మ్యూజిక్ తోనే ఆల్రెడీ హిట్ కొట్టడం పక్కా అనే ఊపు తెచ్చింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: