వారెవా.. అదిరిందిగా.. బిగ్ బాస్ 5 ఫైనల్ ఎపిసోడ్ కి ఊహించని గెస్టులు..!
ఇక బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్ ఎపిసోడ్ ఎలా ఉంటుంది అనుకుంటున్న వారికి ఓ సూపర్ న్యూస్ బయటకు వచ్చింది. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కోసం రాం చరణ్, అలియా భట్ చీఫ్ గెస్టులుగా వస్తారని తెలుస్తుంది. rrr ప్రమోషన్స్ లో భాగంగా చరణ్ ఎలాగు డిస్నీ హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి చరణ్, అలియా భట్ లతో ఫైనల్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నారట.
వీరే కాకుండా బాలీవుడ్ క్రేజీ కపుల్ రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొనెని కూడా తెలుగు బిగ్ బాస్ వేదిక మీదకు తెస్తున్నారట. కపిల్ దేవ్ బయోపిక్ గా వస్తున్న 83 మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొనె బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కు వస్తున్నారని టాక్. 83 తెలుగు వర్షన్ నాగార్జున రిలీజ్ చేస్తుండటం వల్ల సినిమాకు బిగ్ బాస్ ద్వారా ప్రమోషన్స్ ఇప్పిస్తున్నాడు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్ ఎపిసోడ్ మరింత భారీగా.. గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. సీజన్ 4 గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రాగా సీజన్ 5లో చిరుతనయుడు అదే మన మెగా పవర్ స్టార్ రాం చరణ్ వస్తున్నాడని తెలుస్తుంది.