మహేష్ ను ఢీ కొట్టబోతున్న లైగర్!!

P.Nishanth Kumar
పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కార్ వారి పాట చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతుందని గతంలో ప్రకటించగా ఆ సమయంలో చాలా సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుండడంతో మహేష్ వెనక్కి తగ్గక తప్పలేదు. అందరితో రావడం కంటే సోలోగా వచ్చి కలెక్షన్లను రాబట్టుకోవచ్చు అనేదే మహేష్ ఆలోచన కాగా సంక్రాంతికి ఒకేసారి మూడు పెద్ద సినిమాలు పోటీగా వస్తుండడంతో మహేష్ ఆ గుంపులో రావడం కంటే సోలోగా మరొక తేదీకి రావాలని డిసైడ్ అయ్యాడు. దాంతో ఈ సినిమా కాస్త వేసవి కి వెళ్ళింది.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పాటలను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ సినిమా సంక్రాంతి నుంచి తప్పుకున్నట్లు అధికారికంగా వార్తలు అయితే ఏమీ రాలేదు కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రం వేసవి కి పోస్ట్ పోన్ అయ్యింది అని తెలుస్తుంది దర్శకుడు పరశురామ్ మహేష్ బాబు ఇమేజ్  తగ్గట్టుగా ఈ సినిమా తెరకెక్కించ గా సూపర్ స్టార్ అభిమానులు ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

అయితే సోలో గా వద్దామని పోస్ట్ పోన్ చేసుకున్న మహేష్ బాబు తాను పోస్ట్ ఫోన్ చేసుకున్న సమయానికి వేరొక సినిమా వస్తుండడంతో ఒక్కసారిగా ఆయన ఏం చేయాలో అన్న పాలుపోని పరిస్థితిలో పడ్డారు. ఆ సమయంలో విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాథ్ కలిసి చేస్తున్న లైగర్ సినిమా విడుదల కాబోతు ఉండడంతో సర్కారు వారి పాట కు కొత్త పోటీ రాబోతుంది అని తెలుస్తుంది. ఏదేమైనా మహేష్ బాబు తాను తన సినిమాలు విడుదల చేద్దామనుకున్న ప్రతిసారీ కూడా ఇలా వేరే సినిమాలు అడ్డుతగలడం ఆయన అభిమానులు ఏమాత్రం సంతృప్తి నివ్వడం లేదు. పెద్ద సినిమాలు అన్ని ఒకేసారి విడుదల చేయడం రావడం ఇష్టం లేక మహేష్ తన సినిమాను విడుదల పోస్ట్ పోన్ చేసి వేసవికి చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఇద్దరిలో ఎవరు వెనక్కి తగ్గుతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: