ఏపీ ప్రభుత్వం పై ఫైర్ అవుతున్న చిరంజీవి..కారణం..?

frame ఏపీ ప్రభుత్వం పై ఫైర్ అవుతున్న చిరంజీవి..కారణం..?

Divya
కరోనా వచ్చినప్పట్నుంచి ఏపీ ప్రభుత్వం రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.అయితే కొన్ని నెలల కిందట టికెట్ల రేట్లను తగ్గించింది.ఈ విషయంపై సినీ ఇండస్ట్రీలో పెద్దలు అంతా తెగ ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.. అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో సినిమా పెద్దలు అందరూ కలిసి టికెట్ల విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఎంత అడిగినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. టికెట్ల రేట్లను తగ్గించడం తో సినీపరిశ్రమలో ఎంతో మంది కార్మికులకు తీవ్ర నష్టం కలుగుతోంది అంటూ పలువురు వాపోయినా.. చిరంజీవి మాత్రం నెమ్మదిగానే సమస్యను తగ్గించాలని అనుకున్నాడు. కానీ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఏపీ ప్రభుత్వం వినకపోయేసరికి ఒక్కసారిగా ఆయన ఫైర్ అయినట్లు తెలుస్తోంది.


ఆదివారం రోజు  జరిగిన సంతోషం-సుమన్ టీవీ సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్-2021 కార్యక్రమంలో చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు..ఇక  విన్నర్స్ కు తన చేతుల మీదగా ఆయన అవార్డ్స్ అందించడంతో పాటు సినిమా ఇండస్ట్రీ పై ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని ఆయన ఖండించారు. టిక్కెట్ల రేట్లు విషయంలో ఏపీ ప్రభుత్వం మొండిపట్టు వీడాలని ఆయన సభాముఖంగా పేర్కొన్నారు. అంతే కాదు చిరంజీవి మాట్లాడుతూ.. సినిమా వాళ్లే కదా ..? వీళ్ళది ఏముంటుంది అని మమ్మల్ని నిర్లక్ష్యం చేయకండి.. కొన్ని లక్షల కుటుంబాలు ఈ సినీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి.


వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంటే.. మా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నట్లు కాదు..తెలుగు సినీ ఇండస్ట్రీ పేరుప్రఖ్యాతులు పెంపొందించుకోవడం కోసమే కష్టపడి అప్పుతెచ్చి మరి సినిమాలు తీస్తున్నాము. మీకు కావలసిన ,రావలసిన టాక్స్ మీరు తీసుకోండి.. ఎవరూ అభ్యంతరం చెప్పరు.. కానీ దయచేసి సినిమా టికెట్ల రేట్లను పెంచండి.. మీరు సినిమా రేట్లను పెంచకపోతే తెలుగు సినీ పరిశ్రమ పడిపోవడమే కాకుండా కోట్లు ఖర్చు పెట్టి పెద్ద సినిమాలు చేసే స్థోమత కూడా లేకుండా పోతుంది. ప్రేక్షకులు కోరుకునే సినిమాలను తియ్యాలి అనుకుంటాము కానీ మీ వల్ల తీయలేక పోతున్నాము. ఎంతో మంది సినీ కార్మికులు తినడానికి తిండి లేని సమయాలు కూడా గడుపుతున్నారు.. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని సినిమా టికెట్ల రేట్లను పెంచండి. మిమ్మల్ని మీట్ అయి ఈ విషయం గురించి చర్చించుకుందాం అనుకున్నాము.. కానీ మీ నుంచి రెస్పాండ్ రాకపోయేసరికి.. ఇలా సభాముఖంగా అందరి ముందు చెప్పేస్తున్నాను అంటూ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: