కన్ఫ్యూజన్ లో పడిపోయిన శర్వానంద్ కెరియర్ !

Seetha Sailaja
శర్వానంద్ నటించే సినిమాల ఎంపికలో చాల డిఫరెంట్ గా ఉంటాడు. తన వద్దకు వచ్చిన ప్రతి కథను ఓకె చేయకుండా శర్వానంద్ తన కెరియర్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తాడు. ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనకు తాను నిరూపించుకున్న శర్వానంద్ కు ప్రస్తుతం నడుస్తున్న కాలం ఏమాత్రం బాగుండటం లేదు.

ఒకప్పుడు సంక్రాంతి హీరోగా వరస హిట్లతో దూసుకుపోయిన ఇతడు ప్రస్తుతం వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్నాడు. ‘మహానుభావుడు’ మూవీ తరువాత సక్సస్ అనే పదం శర్వానంద్ కాంపౌండ్ నుంచి వెళ్ళిపోయింది. దీనితో అనేక ప్రయోగాలు చేస్తూ డిఫరెంట్ కథలతో తీయబడిపడిన ‘పడి లేచే మనసు’ ‘రణరంగం’ ‘జాను’ ‘శ్రీకారం’ సినిమాలలో నటించినా ఆ సినిమాలు అన్నీ వరస ఫ్లాప్ లుగా మారాయి.  

ఈ నేపథ్యంలో శర్వానంద్ ‘మహాసముద్రం’ పై చాల ఆశలు పెట్టుకున్నాడు.  అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈమూవీతో తన కెరియర్ కు ఒక బ్రేక్ వస్తుందని ఆశించినప్పటికీ ఆ ఆశ నెరవేరలేదు. దీనితో ఇప్పుడు ఇతడి ఆశలు అన్నీ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ పై ఉన్నాయి.  కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. ఈ సినిమాలో శర్వానంద్ జోడీగా రష్మిక నటిస్తోంది.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సరదాగా సాగిపోయే కథ ఇది అన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఇతడికి ప్రేక్షకులలో క్రేజ్ బాగా తగ్గిన పరిస్థితులలో ఈ మూవీకి అద్భుతమైన టాక్ వస్తే తప్ప ప్రేక్షకులు ధియేటర్లకు వచ్చే పరిస్థితులు లేవు. ప్రస్తుతం శర్వానంద్ అటు యూత్ ప్రేక్షకులకు అదేవిధంగా ఫ్యామిలీ ప్రేక్షకులకు దూరమై చాల క్లిష్ట పరిస్థితులలో ఉన్నాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈ పరిస్థితులలో శర్వానంద్ మార్కెట్ మరింత ఒడుదుడుకులకు లోనయ్యే ఆస్కారం ఉంది. ఇండస్ట్రీ లక్కీ గర్ల్ గా చలామణి అవుతున్న రష్మిక అదృష్టం అయినా శర్వానంద్ ను రక్షిస్తుందేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: