మహేష్ బాబు సినిమాలో ఆ సీనియర్ నటుడి పాత్రే హైలైట్ కానుందట..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సర్కారు వారి పాట' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమా లో కోలీవుడ్ నటుడు సముద్రకని ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. సముద్రకని మీద చిత్రీకరించ వలసిన సన్నివేశాలను చిత్రబృందం చిత్రీకరిస్తునట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా ఉంటాయని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ లో నిర్మించిన బ్యాంక్ సెట్ లో వీటి చిత్రీకరణ జరుగుతుంది. మహేష్ బాబు, సముద్రకని మీద చిత్రీకరించే ఈ సీన్లు సినిమాకి మేజర్ హైలైట్ గా మారుతాయి అని చిత్రబృందం తెలియజేస్తోంది. వీరిద్దరి కలయికలో వచ్చే సీన్లు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

అలాగే వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా సహజసిద్ధంగా ఉంటూనే, జనాలను అలరించే విధంగా ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటి వరకూ జరిగిన షూటింగ్ అంతా ఒక ఎత్తు మహేష్ బాబు, సముద్రకని మీద ప్రస్తుతం జరిగే సీన్లు ఒక ఎత్తు అని తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ కోసం దర్శకుడు పరశురామ్ ప్రత్యేక శ్రద్ధను పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  అదే విధంగా దర్శకుడు పరుశురామ్, మహేష్ బాబు ను ఈ సినిమాలో సరి కొత్తగా చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు జనాల నుండి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకోవడం మాత్రమే కాకుండా సినిమాపై ఉన్న ఆసక్తిని మరింతగా పెంచాయి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్- 14 రీల్స్ - జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రెండువేల 2022 జనవరి 13వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అఫీషియల్ గా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: