భీమ్లా నాయక్ తో భారీ డీల్ సెట్ చేసుకున్న అమెజాన్ ప్రైమ్...!
ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకునేందుకు అమేజాన్ ప్రైమ్ బాగా ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.అమేజాన్ ఇందు కోసం సుమారు రూ. 15 కోట్లు పెట్టనుందని సమాచారం అందింది. ఇదిలా ఉంటే ఈ సినిమా థియేటర్లలో విడుదలైన నెల రోజుల తరువాత అమేజాన్ ప్రైమ్లో రానుందని వార్తలు వస్తున్నాయని సమాచారం. మరి ఈ వార్తల్లో అస్సలు ఎంత వరకు నిజం ఉందో తెలియాలి అంటే ఆ చిత్ర నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందేనట.
ఇదిలా ఉంటే మలయాళంలో భారీ విజయం సాధించిన అయ్యప్పునుమ్ కోషియుమ్ సినిమాకు తెలుగులో భీమ్లా నాయక్ పేరుతో రీమేక్ చేస్తోన్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ మరియు రానాలు హీరోలుగా నటిస్తుండగా ఐశ్వర్య రాజేష్ మరియు నిత్య మీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారని సమాచారం. ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయని సమాచారం. ఇక తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయని సమాచారం. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తూ మరియు ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమాకి అంచనాలు మరింతగా పెరిగాయని తెలుస్తుంది. భీమ్లా నాయక్ను సంక్రాంతి కానుకంగా జనవరి 12న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం.