ఏపీ ( కూటమి): గత్యంతరం లేక పొత్తు.. బాబు లబోదిబో..!

Divya
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గెలుపే లక్ష్యంగా కూటమితో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్నది ఆయన ప్రధాన లక్ష్యం.. పైగా వయసు అయిపోవడం,  దాదాపు ఇవే చివరి ఎన్నికలు కావడం,  వారసుడైన లోకేష్ ను గద్దెనెక్కించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే బలమైన అధికార పార్టీని ఢీ కొట్టడానికి ఒంటరిగా పోరాడలేక జనసేనతో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు.. అయితే జనసేనతో పొత్తు పెట్టుకున్నప్పటికీ జగన్ ను  ఎదుర్కోగలమనెవ్నమ్మకం కలగలేదు.. అందుకే  వ్యవస్థల సహాయం కావాలంటే కేంద్రంలో అధికారంలో చలామణిలో ఉన్న బిజెపితో పొత్తు తప్పనిసరి అని నిర్ణయించుకున్నారు.. అనుకున్నదే తడువుగా పవన్ కళ్యాణ్ ద్వారా పలు దఫాలుగా బిజెపితో రాయబారాలు జరిపి చివరికి పొత్తు పెట్టుకోవడంలో విజయం సాధించారు.. అయితే ఇప్పుడు ఈ వ్యవస్థల నుంచి కూడా తగిన సహాయ సహకారాలు లభించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టిడిపి నేతలు..

నిజానికి అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డిజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి లను  వెంటనే మార్చేయాలని బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకున్న వెంటనే వీరిద్దరిని మార్చేయాలని బిజెపిని కోరింది టిడిపి.. కానీ అక్కడే టిడిపికి చుక్కెదురయింది.. ఎన్నికలకు కేవలం వారం ముందు మాత్రమే పోలీస్ బాస్  డిజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మారిపోయారు.. కొత్తగా వచ్చిన డీజీపీ హరీష్ గుప్తా కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారి అని టిడిపి నేతలు అంటున్నారు.. ఇప్పటికే ముగ్గురు ఐఏఎస్ లు, 5 మంది ఐపీఎస్ అధికారులపై వేటు వేసినా.. కొత్తగా వచ్చిన వారు కూడా అటు వైసీపీకే అనుకూలంగా ఉండడంతో టిడిపి నేతల్లో ఒక్కసారిగా ఆందోళనలు మొదలయ్యాయి..ఒకరకంగా చెప్పాలంటే బిజెపితో  పొత్తు వల్ల కలిగే రాజకీయ లాభం కంటే నష్టమే ఎక్కువగా కనిపిస్తోంది..


ముఖ్యంగా బీజేపీతో పొత్తు కలపడం వల్ల అప్పటివరకు అనుకూలంగా ఉన్న ముస్లిం,  క్రిస్టియన్,  మైనారిటీలు కూడా ఇప్పుడు దూరమైపోయారు.. అలాగే దళితుల ఓట్లు కూడా ఆశించిన స్థాయిలో పడవనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక లాభం కోసం కూటమితో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు అనుకూలం లేకపోయేసరికి లబోదిబో అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: