రాంచరణ్ కు ఎన్టీఆర్ నటించిన ఆ సినిమా అంటే అంత ఇష్టమా...?

murali krishna
తనదైన నటనతో అందరిని ఎన్టీఆర్ ఎంతగానో మెప్పిస్తాడు. ఒక చిన్న హీరోగా ఎటువంటి సపోర్ట్ లేకుండా సినీ పరిశ్రమకి పరిచయం అయిన ఎన్టీఆర్ మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా రామాయణం సినిమాతో తన నటన స్థాయి ఏంటో చూపించాడు. ఎన్టీఆర్ తన మొదటి సినిమా నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయమయి ఇప్పుడు ఇండియన్ సినిమా రంగంలోనే ఒక బిగ్ స్టార్ గా ఉన్నారు. తన నటనతో తన తాతగారు అయిన నందమూరి తారక రామారావు స్థాయిని అందుకొని ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాడు ఎన్టీఆర్. నటన తన రక్తంలోనే ఉంది అని నిరూపించుకున్నాడు. ఇటీవల మొదలైన ఎవరు మీలో కోటీశ్వరుడు షోకు ఎన్టీఆర్ వ్యాఖ్యతగా చేస్తున్నాడు. ఈ షో  కర్టన్ రైజర్ ఆదివారం ప్రసారమైంది.
ఈ షో తెలుగు ప్రేక్షకులకు కొత్త ఏమి కాదు. అందరికి తెలిసిందే అంతకు ముందు నాగార్జున, చిరంజీవి వంటి బిగ్ స్టార్స్ వ్యాఖ్యతలుగా చేసారు. మళ్ళీ చాలా సంవత్సరాలు తరువాత ఎన్టీఆర్ వ్యాఖ్యతగా ఈ షో ప్రారంభమైంది. ఆదిలోనే ఎన్టీఆర్ తనదైన వాక్ చతుర్యంతో  ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ షోకు మొదటి గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రావడం జరిగింది.రామ్ చరణ్ ఎంతో ఘనంగా ఎన్టీఆర్ షోకు ఆహ్వానించాడు. ఈ షోకు రాంచరణ్ వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని ఎన్టీఆర్ తెలిపాడు. ఈ షోకు ఎన్టీఆర్ వ్యాఖ్యతగా చేస్తుందటం తనకెంతో ఆనందం కలిగించిందని రాంచరణ్ తెలిపాడు. ఎన్టీఆర్ రాంచరణ్ పంచుకున్న కబుర్లతో ఈ షో నడవడం మొదలైంది. ఎంతో ఓపికతో ఎన్టీఆర్ షో ప్రత్యేకత చెప్పాడు.ఇదిలా ఉండగా ఈ షో లో కంప్యూటర్ ను ఎన్టీఆర్ ముద్దుగా గురువుగారు అని పిలిస్తాడు. ఆ పిలుపుకు రాంచరణ్ కు అదుర్స్ సినిమాలో ఒక సీన్ గుర్తుకు వచ్చి ఎన్టీఆర్ తో పంచుకోవడం జరిగింది. ఇందులో తనకి అదుర్స్ సినిమా అంటే చాలా ఇష్టమని నేను చాలా ఒత్తిడికి లోనైయినపుడు రిలాక్స్ కోసం ఆ సినిమా చూస్తాను అని చెప్పాడు. ఎన్టీఆర్ మాట్లాడుతూ ఈ సినిమా వినాయక్ చాలా కసితో చేసాడు అని చెప్పాడు. మంచి కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడని చెప్పాడు. ఇలా ఎన్నో కబుర్లతో ఈ షో కర్టన్ రైజర్ కొనసాగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: