మహేష్ ప్రక్కన జూనియర్ అతిలోక సుందరి .... అసలు వాస్తవం ఇదే .... ??
అటు మహేష్ బాబు, ఇటు త్రివిక్రమ్ ఇద్దరూ కూడా మంచి సక్సెస్ లతో దూసుకెళ్తుండడంతో త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా రేపు రిలీజ్ తరువాత సరికొత్త రికార్డ్స్ సృష్టించడం ఖాయం అని అప్పుడే చాలామంది అంచనాలు మొదలెట్టేశారు. ఇక ఈ సినిమా కథ మంచి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగనుందని, మహేష్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ లో యాక్ట్ చేయనుండగా ఒక కీలకమైన పాత్ర లో బాలీవుడ్ కి చెందిన సీనియర్ నటి ఒకరు యాక్ట్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం.
ఇక అసలు విషయంలోకి వెళితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనే దానిపై కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతున్నాయి. కొందరేమో పూజా హెగ్డే అంటుంటే, మరికొందరేమో రష్మిక, జాన్వీ కపూర్, కియారా అద్వానీల పేర్లు ప్రచారం చేస్తున్నారు. అయితే కొద్దిరోజుల క్రితం ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయిందని, త్రివిక్రమ్ ఆమెకు కథని వినిపించి కాల్షీట్స్ కూడా తీసుకున్నారని వార్తలు వచ్చాయి. కాగా పలు టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందిన సమాచారం ప్రకారం ఆ వార్తలో ఏ మాత్రం నిజం లేదని, ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ సహా పలు క్యారెక్టర్స్ కి ఆర్టిస్టులని ఫైనలైజ్ చేయాల్సి ఉందని, త్వరలోనే యూనిట్ వారి పేర్లు అధికారికంగా ప్రకటించనుందని సమాచారం. దీనితో ఈ సినిమాలో జాన్వీ నటిస్తోంది అంటూ వస్తున్న పుకార్లకి పూర్తిగా అడ్డుకట్ట పడిందని అంటున్నారు విశ్లేషకులు .... !!