స్నేహబంధం కాస్త బంధుత్వంగా మారిన వేళ..

Divya
స్నేహం అంటే సుఖాల్లో మాత్రమే పాలుపంచుకోవడం కాదు.. కష్టంలో కూడా నేనున్నాను అంటూ వెన్నుతట్టే వాడే నిజమైన స్నేహితుడు అని అంటారు. ఇక అలాంటి వారిలో మన సినీ ఇండస్ట్రీలో కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఇద్దరు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుందాం..
మొదట గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తుల మధ్య పరిచయం ఏర్పడి,  ఆ పరిచయం స్నేహంగా మారి, ఆ  స్నేహం కాస్త బంధుత్వంగా మారింది. ఇప్పటికే వారెవరో మీకు గుర్తుకు వచ్చే వుంటుంది కదా..! ఇక వారెవరో కాదు.. ప్రముఖ స్టార్ హీరో అక్కినేని నాగేశ్వర రావు అలాగే ప్రముఖ నిర్మాత డి రామానాయుడు. అయితే వీరిద్దరూ సినీ ఇండస్ట్రీలో ఇంత మంచి విజయాన్ని సాధించారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపుగా అక్కినేని నటించిన ఎన్నో చిత్రాలకు డి. రామానాయుడు నిర్మాతగా వ్యవహరించి , మంచి సక్సెస్ ను  అందుకున్నారు.
ఒకసారి షూటింగ్ సమయంలో అక్కినేని డి.రామానాయుడిని కలిసినప్పుడు,  సినీ ఇండస్ట్రీ లోకి రావచ్చు కదా..!  అని అడిగాడు. ఇక మిత్రుడి మాటను కాదనలేక, తనకున్న వ్యాపారాలు అన్నింటిని పక్కన పెట్టేసి , సినీ ఇండస్ట్రీలోకి నిర్మాతగా అడుగుపెట్టాడు రామానాయుడు. ఇక ఇద్దరూ ఎన్నో చిత్రాలను నిర్మించి తెలుగు సినీ పరిశ్రమకు మరింత ఖ్యాతిని చేకూర్చారు. ఇక ఈ స్నేహమే బంధుత్వంగా మారింది. అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున కు డి. రామానాయుడు తన కూతురిని ఇచ్చి వివాహం జరిపించారు.
అలా వారిద్దరూ స్నేహితులు కాస్త.. బావా బామ్మర్దులు గా మారారు. ఇక అంతే కాదు వీరి వారసులైన అక్కినేని నాగార్జున అలాగే దగ్గుబాటి వెంకటేష్ కూడా సినీ ఇండస్ట్రీలో బావబామ్మర్దులగా ఒకేసారి హీరోలుగా  అడుగుపెట్టి, ప్రస్తుతం స్టార్ హీరోలుగా గత కొన్ని సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇక అక్కినేని నాగేశ్వరరావు డి.రామానాయుడు ఇద్దరూ స్నేహానికి నిర్వచనం ఏంటో భావితరాల వారికి చాటి చెప్పారు. స్నేహం అనేది ఇరు కుటుంబాలకు చెందినది అని స్పష్టంగా నిరూపించారు. అందుకే ఎన్ని సంవత్సరాలు దాటినా కూడా మనం వీరి స్నేహం గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: