ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే.. అద్దిరిపోయే అప్డేట్..!

Pulgam Srinivas
డార్లింగ్ ప్రభాస్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఈ సినిమా ఇచ్చిన జోష్ లోనే వరుస పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఈ హీరో ఇష్టపడుతున్నాడు. అందులో భాగంగానే సుజిత్ దర్శకత్వం లో 'సాహో' సినిమా తీసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా తెలుగులో కంటే బాలీవుడ్ జనాల మీద ఎక్కువ ప్రభావం చూపిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో  'రాధేశ్యామ్' సినిమాతో పాటు ఓం రావత్ దర్శకత్వంలో  'ఆది పురుష్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలలో 'రాదే శ్యామ్' షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. ఈ సినిమా నుండి చాలా రోజుల క్రితమే కొన్ని ప్రచార చిత్రాలను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. వీటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ కూడా దక్కింది. 

అయితే ఆ తర్వాత మాత్రం సినిమా నుండి ఎలాంటి అప్డేట్లు రావడం లేదు. దానితో ప్రభాస్ అభిమానులతో పాటు సామాన్య సినీ అభిమానులు కూడా ఈ సినిమాకు ఏమైంది ఇంకా ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు అని నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం అటు చేరి ఇటు చేరి చివరిగా సినిమా డైరెక్టర్ వరకు వెళ్ళింది. వెంటనే స్పందించిన దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే న్యూస్ ని చెప్పాడు. సినిమా చివరి షెడ్యూల్ కూడా పూర్తి అయింది అని , ఈ పాండమిక్ మన అందరి ఊహలను చాలా నిరాశ పరిచింది. ఎంతో ఓపికగా  డార్లింగ్  ప్రభాస్ ఫ్యాన్స్ అందరిపై నా ప్రేమను కురిపిస్తున్నాను. అధికారిక ప్రకటన మరో మూడు రోజుల్లో వస్తుంది. అందరం ఎదురు చూద్దాం అంటూ దర్శకుడు రాధాకృష్ణ ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశాడు. ప్రభాస్ ఈ సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: