అక్కినేని కాంపౌండ్ నుండి మరో మల్టీ స్టారర్ ?
ప్రస్తుతం అఖిల్ సినీ కెరీర్ కూడా అంత ఆశాజనకంగా లేకపోవడంతో ప్రయోగాలు చేసే పనిలో పడ్డారు. ఇక కొడుకు కెరీర్ ను చక్కదిద్దే బాధ్యతను తండ్రి తన భుజాలపై వేసుకున్నాడు. ఈ సినిమాతో ఓ నూతన దర్శకుడు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నట్లు సమాచారం. కథ ఇప్పటికే సిద్ధమైనా, ఇంకా తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట. నాగార్జున సొంత నిర్మాణం లోనే ఈ సినిమాను నిర్మించనున్నారని టాక్.
కాగా ప్రస్తుతం అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' మరియు 'ఏజెంట్' చిత్రాలతో బిజీగా ఉన్నారు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' విడుదలకు సిద్ధంగా ఉండగా, ఏజెంట్ ఇంకా షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు కాకా మరో రెండు సినిమాలు కూడా అఖిల్ లైన్ లో పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. అందులో నాగార్జున తో చేస్తున్న ఒకటి కావొచ్చని గుసగుసలు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ, వార్త మాత్రం అక్కినేని అభిమానులను ఎంతగానో అట్రాక్ట్ చేస్తోంది.