పూ లేదా పార్వతి.. మీరు ఎవరి అభిమానులు అంటున్న జాన్వీకపూర్..
ఇక నెట్ ఫిక్స్ లో ప్రసారమైన ఘోస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో కూడా 2020 లో నటించడం జరిగింది. అయితే జాన్వీ కపూర్ మాత్రం సినీ ఇండస్ట్రీలో కథను ఎంచుకోవడంలో ఆచితూచి అడుగు వేస్తోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోని సినిమా కథలు నచ్చితేనే , అందులో ఆ పాత్రకు ఆమె కు విలువ ఉంటుంది అని తెలిస్తే, ఆమె నటించడానికి ఒప్పుకుంది. అలా ఏడాదికి ఒకటి రెండు సినిమాలను మాత్రమే నటించడానికి ముందుకు వస్తున్న జాన్వీకపూర్.
ఇకపోతే సోషల్ మీడియాకు ఎప్పుడూ దగ్గరగా ఉండే జాన్వీకపూర్ , ఇటీవల అభిమానులకు ఒక ప్రశ్న వదిలింది. అదేమిటంటే ..ఆమె రెండు ఫోజ్ లని కలిగిన ఒక ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి, ఇందులో పూ లేదా పార్వతి మీరు ఎవరికీ అభిమానులు అంటూ అడిగింది. ఇక జాన్వీ కపూర్ కు సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో 12 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తమ అభిమానులను ఉత్తేజ పరుస్తూ సర్ప్రైజ్ చేస్తూ ఉంటుంది. ఇక అందులో భాగంగానే ఈసారి కూడా రెండు చిత్రాలను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. అయితే ఇది చూసిన వాళ్లంతా జాన్వీకపూర్ లో ఇలాంటి కోణాలు కూడా ఉన్నాయా..? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
అంతకుముందు ఫ్రెంచ్ ఫ్రైస్ ఆరగిస్తూ ఒక ఫోటోను షేర్ చేసింది ఇప్పుడు ఇలా ఫోటోలను షేర్ చేసింది.ఇక తన ముందు వడ్డించిన ఆకులో అనేక వంటకాలతో పాటు కొబ్బరి పచ్చడి,దోశ కూడా ఉన్నాయి.