ప్రభాస్ ధూమ్ సినిమా చేయొద్దంటున్న ఫ్యాన్స్. కారణం క్రేజీ గా ఉంటుంది!!

P.Nishanth Kumar
సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఫాలో అవడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. సెలబ్రిటీ లు అందరూ ఏదో ఒక రకంగా సెంటిమెంటును ఫాలో అవుతూ సినిమాలు చేస్తూ ఉంటారు. తమ జీవితాలలో కూడా సెంటిమెంట్ ను ఫాలో అయ్యే వారు చాలామంది ఉంటారు. సినిమా వారు కాస్త ఎక్కువగా ఈ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ జీవితాలను కూడా రన్ చేసుకుంటూ ఉంటారు. అయితే హీరోల విషయంలో హీరోలు మాత్రమే కాకుండా ప్రేక్షకులు కూడా సెంటిమెంట్ ను ఫాలో అవుతూ ఉంటారు.

ఆ సెంటిమెంట్ ఫాలో అయితే ఇలా ఆవుతుందని, ఈ సెంటిమెంట్ ఫాలో అయితే అలా అవుతుంది అని హెచ్చరిస్తూ వారు కెరీర్ సాఫీగా సాగాలని కోరుకుంటారు. ఆ విధంగా రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల విషయంలో ఆయన అభిమానులు ఎప్పటికప్పుడు సెంటిమెంట్ ని ఆయనకు గుర్తు చేస్తూ సరైన సినిమాలు చేయాలని చెబుతూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ లో ఆది పురుష్ చేస్తున్న ప్రభాస్ ఆ తర్వాత ధూమ్ సినిమా కూడా చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాలో ప్రభాస్ నటించొద్దు అని ప్రభాస్ అభిమానులు హెచ్చరిస్తున్నారు. దానికి కారణం ఆ సినిమాలో నటించిన హీరోలు తమ భార్యలతో విడిపోవడమే.

 జాన్ అబ్రహం ఈ సినిమాలో నటించిన బిపాసాబసు తో ప్రేమలో ఉండే వాడు ఆ తర్వాత వారిద్దరు విడిపోయారు. హృతిక్ రోషన్ అతని భార్య సుసానే ఖాన్ తో వివాహబంధాన్ని ఎప్పుడో ముగించాడు. ఇటీవలే ధూమ్ 3 లో నటించిన అమీర్ ఖాన్ కూడా తన భార్య కిరణ్ రావ్ కు విడాకులు ఇచ్చాడు. ప్రభాస్ కూడా ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటే వీరి లాగానే  చేస్తాడు అనే చిన్న సెంటిమెంట్ తో వారు ఈ సినిమా చేయ వద్దని ప్రభాస్ ను వేడుకుంటున్నారు. ధూమ్ 4 లో సల్మాన్ ఖాన్ హీరోగా చేయబోతున్నాడనే మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో రాధేశ్యామ్ సినిమా ముందుగా విడుదలవుతుండగా ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని సలార్ ఆ తర్వాత ఆదిపురుష్, నాగ్ అశ్విన్ ల సినిమాలు విడుదల కానున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: