తెలుగు లో ఎన్ని డిఫరెంట్ సినిమాలు వచ్చినా ప్రేమకథలకు ప్రేక్షకులు ఎప్పుడూ వెల్కమ్ చెప్తూనే ఉంటారు. సినిమా బాగుంటే పబ్లిసిటీ లేకుండానే మంచి విజయం అందిస్తారు. ఇప్పటి వరకూ కథ..కథనం ఆకట్టుకునేలా ఉండి ఎలాంటి పబ్లిసిటీ లేకుండా విజయం సాధించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలా పెద్దగా పబ్లిసిటీ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించిన ప్రేమ కథా చిత్రం మళ్లీ మళ్లీ ఇది రాని రోజు. తెలుగులో ఎన్నో ప్రేమకథలు వచ్చినప్పటికీ ఈ సినిమా ఎన్నో ప్రత్యేకతలో వచ్చి ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే తో పాటు కే. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు. సినిమాలో శర్వానంద్ నిత్య మీనన్ హీరో హీరోయిన్ లుగా నటించారు.
ఈ సినిమాలో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి కసితో తన జీవితంలోని గోల్ ని ఎలా సాధిస్తాడు. అన్నవిషయాన్ని చూపించడంతో పాటు మనుషులు కలవకపోయినా మనసులతో ఎలా ప్రేమించుకోవడం అనేదాన్ని చూపించారు. అంతే కాకుండా హీరోయిన్ ముఖం చూడకుండా ప్రేమించడం అనేది కూడా ఈ సినిమాలోనే చూపించడం విశేషం. సాధారణంగా ఏ సినిమాలో అయినా హీరో హీరోయిన్ ను ప్రేమించడం ఇద్దరూ చివరి వరకు కష్టాలు పడి మహా అయితే కొంత కాలం తర్వాత కలిసిపోతారు. కానీ ఈ సినిమాలో యవ్వన వయస్సులో ప్రేమించుకుని లేటు వయసులో మళ్లీ కలుసుకుంటారు.
కానీ ఏళ్లు గడిచినా ఒకరిని ఒకరు మర్చి పోకుండా జ్ఞాపకాలతోనే బ్రతికేస్తుంటారు. ఈ క్రమంలో జరిగే ట్విస్టులు...సినిమాలో వచ్చే డైలాగులు ప్రేక్షకులను కట్టి పడేస్తాయి. అంతే కాకుండా రోత రొటీన్ ప్రేమ కథలను చూసి విసిగిపోయిన తెలుగు ప్రేక్షకులకు ప్రేమంటే ఇలా ఉండాలి అని మళ్లీ మళ్లీ ఇది రాని రోజు గుర్తు చేసింది. ఇక ఈ సినిమాలో మరో విషయం ఏమిటంటే కేవలం మతాలు వేరు కానీ ప్రేమ స్వచ్చం అని తెలిపారు. తల్లిదండ్రుల కోసం విడిపోయినప్పటికీ ఇతరులను పెళ్లి చేసుకోకుండా జ్ఞాపకాల తోనే బతికి బతికేస్తుంటారు. ఎట్టకేలకు చివర్లో కలిసి ప్రేక్షకులు ఊపిరి పీల్చుకునేలా చేస్తారు.