పద్మ పురస్కారంపై సోనూ స్పందన ఇదే..!
సామాన్యులనుంచి రాజకీయ నాయకుల దాకా అందరూ ఆయన సేవలను మెచ్చుకుంటున్నారు. అయితే రీసెంట్గా తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోనూసూద్పై ప్రశంసలు కురిపించారు. సోనూసూద్ రియల్ హీరో అంటూ ట్వీట్ కూడా చేసిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు పద్మ అవార్డుల కోసం నామినేషన్లు స్వీకరిస్తుండగా.. టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ ఏకంగా సోనుసూద్ఖ/ పద్మ శ్రీ ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
సోనూ సూద్ చేస్తున్న సేవలకు పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలంటూ బ్రహ్మాజీ ట్వీట్ చేశాడు. అలాగే తన డిమాండ్ను సపోర్టు చేసే వారంతా తన ట్వీట్కు రీట్వీట్ ఇవ్వాలంటూ కోరాడు. ఇక అంతే సంగతి ఒక్కసారిగా ట్విటర్లో ఆ ట్వీట్కు రీట్వీట్ల సునామీ మొదలైంది. ఇక ఈ ట్వీట్ పై సోనూసూద్ వెరైటీగా స్పందించారు. తనకు 135 కోట్ల మంది భారతీయుల ప్రేమ, అభిమానమే అతిపెద్ద పురస్కారమని స్పస్టం చేశాడు.
తాను ఇప్పటికే ఆ అవార్డును అందుకున్నానని వెల్లడించాడు. అయితే బ్రహ్మాజీ అభిమానానికి ధన్యవాదాలు తెలిపాడు సోనూసూద్. ఇక ఈ ట్వీట్కు వేలాది ట్వీట్లు వస్తున్నాయి. ఇక త్వరలోనే కేంద్రం నామినేషన్లపై కసరత్తు చేయనుంది. దేశ అత్యున్నత పౌర పురస్కారాలు అయిన పద్మ విభూషణ్, పద్మభూషన్, పద్మశ్రీ అవార్డులకు నామినేషన్లు సెప్టెంబర్ 15 న లాస్ట్ డేట్ అని కేంద్రం తెలిపింది.