ప్రభాస్, చిరు.. ఫోటో లో ఉన్న ఈ కాంబో నిజమైతే బాగుండు..!!

P.Nishanth Kumar
కొన్ని కొన్ని కాంబో లలో సినిమాలు రావాలంటే ఎంతైనా పెట్టి పుట్టాలి.. సినిమా ఇండస్ట్రీ లో చాలా కాంబో లు రావడానికి ఉత్సాహంగా ఉన్నా సరైన కథ లేక ఆయా హీరోలు సినిమాల రూపంలో ప్రేక్షకుల ముందుకు రావడం లేడు.. అయితే నార్మల్ గా తమకు ఉన్న అనుబంధాన్ని, బంధాన్ని కొన్ని కొన్ని ఈవెంట్స్ లలో ఫంక్షన్స్ లలో చూపిస్తారు.. అలా చాలామంది హీరోలు కలిసి ఫోటోలు దిగారు.. ఓ ఫంక్షన్ లో కలిసి దిగారు ప్రభాస్ , చిరులు.. ఫోటో చూస్తూనే ఇలా ఉందంటే... సినిమా చేస్తే ఇంకే రేంజ్ లో ఉంటది అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు..

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.. ఇకపోతే చిరు ప్రస్తుతం ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కితున్న ఈ సినిమా తరువాత మరో మూడు సినిమాలను చిరంజీవి ఒప్పుకొని యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు.. ఈ సినిమా తర్వాత మోహన్ దర్శకత్వంలో  రీమేక్ సినిమాని చిరంజీవి చేస్తుండగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో మరో సినిమా, బాబీ దర్శకత్వంలో ఇంకో సినిమా చిరంజీవి చేస్తున్నారు..

ఇకపోతే ప్రభాస్ రాధే శ్యామ్ , సలార్ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్న విషయం తెలిసిందే. రాధే శ్యామ్ ఈ జులై లో విడుదల అవుతుండగా సలార్ ని దసరా కి ప్లాన్ చేస్తున్నారు.  కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. శెరవేగంగా షూటింగ్ జరుపుకుంటుది... బాహుబలి తో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తుండడం విశేషం.. కేజీఎఫ్ తర్వాత  ప్రశాంత్ చేయబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: