14 ఏళ్ళు పూర్తి చేసుకున్న వెంకటేష్ 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే'....

Purushottham Vinay
ఇండస్ట్రీలో చాలా మంచి మంచి సినిమాలు వస్తుంటాయి. అలాంటి మంచి చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకోచ్చే హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఇక వెంకటేష్ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. అలాంటి చిత్రాలో వెంకటేష్  నటించి చిత్రం 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే'.కూడా ఒక మంచి చిత్రంగా టాలీవుడ్ లో నిలిచిపోతుంది. తండ్రి కొడుకుల మధ్య ఉండే ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, ఫ్రెండ్ షిప్ ఇలా ఎన్నో అంశాలతో ఈ సినిమా తెరకెక్కి ఎంతగానో ఆకట్టుకుంది.తమిళ స్టార్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 'శ్రీ సాయి దేవా ప్రొడక్షన్స్' బ్యానర్ పై ఎన్.వి.ప్రసాద్ - శానం నాగ అశోక్ కుమార్ కలిసి నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇక ఈ సినిమా పాటలు ఎంతగానో హిట్ అయ్యాయి.శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.


ఇప్పటికి కూడా ఈ సినిమా పాటలు ఆకట్టుకుంటూనే వున్నాయి.ఇక ఈ సినిమాకి బాలమురుగన్ సినిమాటోగ్రఫీ అందించడం విశేషం. ఎంతో అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించాడు. ఇక 2007 వ సంవత్సరం ఏప్రిల్ 27 న విడుదలైన ఈ చిత్రానికి మొదట మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ తరువాత బాగానే పికప్ అయ్యి.. మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మ రధం పట్టారు.ఇక ఈ రోజుతో ఈ చిత్రం విడుదలయ్యి 14 ఏళ్ళు కావస్తోంది.ఇక ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే...'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' చిత్రానికి రూ.13.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.18.10 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం కొనుగోలు చేసిన బయ్యర్స్ కు రూ.4.3 కోట్ల లాభాలు మిగిలిలింది. మొదటి రోజు టాక్ ని విని సినిమా నష్టాల పాలవుతుందని చిత్ర బృందం కంగారు పడ్డారట. కాని ఈ సినిమా అంత పెద్ద విజయం సాధించడంతో చాలా సంతోషాపడ్డారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: