పవన్ కళ్యాణ్‌కు హ్యాండు ఇచ్చిన మరోనటి.. ఎందుకంటే..!?

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. నటుడు రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ ఓ మలయాళ సినిమా తెలుగులో రీమేక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్.. అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. మరో కీలక పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ సుమారు 40 రోజులు డేట్స్ కేటాయించారట. మలయాళంలో పృధ్వీరాజు సుకుమారన్ నటించిన పాత్రలో రానా నటిస్తుండగా.. బీజు మీనన్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో రానా సరసన ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నట్లు, పవన్ సరసన సాయి పల్లవి కనిపించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే సాయి పల్లవి తప్పుకుంది. కొన్ని అనుకోని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది.
ఇక తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఐశ్వర్య రాజేష్ కూడా తప్పుకుందని తెలుస్తోంది. ఈ మార్చిలో షూటింగ్ జరుపుకోనుంది. అయితే అటు సాయి పల్లవి, ఇటు ఐశ్వర్యా రాజేష్‌లు ఇద్దరూ మార్చి బిజీగా ఉండడం వల్ల డేట్స్ సర్దుబాటు చేయలేకపోయారట. దీంతో ఈ టాలెంటెడ్ నటీమణులు ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక చేసేందేం లేక చిత్రబృందం మరో ఇద్దరిని వెతికే పనిలో ఉందట. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈ సినిమా. ఏ ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ మూవీగా వస్తోంది. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో ఈసినిమాను పాన్ ఇండియా లెవల్‌లో అప్పీల్ కావడంతో అన్ని భాషాల్లో విడుదల చేయనుంది చిత్రబృందం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: