టాలీవుడ్ సెన్సేషనల్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తను చేస్తున్న సర్కారు వారి పాట సినిమా పై పూర్తి దృష్టి పెట్టారు. ఇక ఈ మూవీలో మహేష్ బాబు ఆర్థిక నేరస్థుడు గా కనిపించనుండగాఆ పాత్ర కోసం ఆయన పూర్తిగా లాంగ్ హెయిర్ ని పెంచడంతోపాటు తన మేకోవర్ ని కూడా పూర్తిగా మార్చేశారు.
యువ దర్శకుడు పరుశురాం పెట్ల దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా 14 రీల్స్ ప్లస్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ లు దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఖర్చుతో నిర్మిస్తున్నాయి. మహేష్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు పరుశురాం ఈ సినిమా కథని ఎంతో అద్భుతంగా రాసుకున్నారని తప్పకుండా రిలీజ్ తర్వాత ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం ఖాయమని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ యొక్క తొలి షెడ్యూల్ ఇటీవల దుబాయ్ లో ప్రారంభమై నిన్నటితో ముగిసింది. అందుతున్న సమాచారాన్ని బట్టి దీని ఒక రెండో షెడ్యూల్ ని గోవాలో ఫిక్స్ చేసినట్లు సమాచారం.
రేపు మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి ఇండియా చేరుకొని ఆపై గోవా వెళ్తారని, మార్చి మొదటి వారం నుంచి అక్కడ రెండో షెడ్యూల్ ప్రారంభమై ఏప్రిల్ మొదటి వారం వరకు కొనసాగుతుందని అంటున్నారు. హీరో హీరోయిన్ సహా పలువురు ముఖ్య నటులు ఈ షెడ్యూల్లో పాల్గొన్నారని అలానే కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా అక్కడ తీయనున్నారు అని చెప్తున్నారు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమా మహేష్ కి ఎంతవరకు సక్సెస్ ని అందిస్తుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే....!!