మంచు మోహన్ బాబు.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఎన్నో సినిమాలలో నటించి ప్రజల మెప్పు పొందారు. కలెక్షన్ కింగ్ పేరుతో అందరికీ దగ్గరయ్యారు. అయితే నటన వయసుకు సంబంధించింది కాదు.. మనసుకు సంబంధించినది అంటూ మోహన్ బాబు వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు..ఇకపోతే ఇప్పుడు తన కుటుంబంలోని అందరూ సినిమాలలో నటిస్తున్నారు. ఎప్పుడు ఏదోక కార్యక్రమం తో బిజీగా ఉండే మంచు ఫ్యామిలీ ఇప్పుడు వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు.తన తండ్రికి షాక్ ఇచ్చే రేంజులో మంచు లక్ష్మి ట్రిప్ ను ప్లాన్ చేసింది.వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. ఈ టూరుకు సంబంధించిన ఫొటోలను లక్ష్మి నెట్టింట్లో పోస్ట్ చేశారు.
బీచ్లో విందు ఏర్పాటు చేసి మా నాన్నను సర్ప్రైజ్ చేశాను. మా నాన్న నటించిన చిత్రాల్లోని కొన్ని పాటలను వింటూ.. సాగర అందాలను తిలకిస్తూ.. ఇష్టమైన భోజనాన్ని ఆస్వాదించాం. ఇలా.. మాకోసం మేము ప్రత్యేకంగా కొంత సమయాన్ని గడిపి చాలారోజులు కావడంతో వ్యక్తిగతంగా ఈ క్షణాలు నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. అంటూ మంచు లక్ష్మీ చెప్పుకొచ్చారు.
ఇకపోతే మంచు వారి సినిమాల విషయానికొస్తే..సన్ ఆఫ్ ఇండియా'లో ప్రస్తుతం మోహన్బాబు నటిస్తున్నారు. ఆ సినిమా చిత్రీకరణ గతేడాది ప్రారంభమైంది. మరోవైపు హిందీలో ప్రేక్షకాదరణ పొందిన 'లస్ట్ స్టోరీస్'ను తెలుగులో 'పిట్టకథలు' పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మంచులక్ష్మి ఓ విభిన్నమైన పాత్రలో నటించారు. ఈ సినిమా త్వరలో నెట్ఫ్లిక్స్ వేదికగా తెలుగు వారిని పలకరించ బోతుంది. మంచు లక్ష్మి కూడా తనదైన స్టైల్లో షో లు , పలు టీవీ కార్యక్రమాలతో పాటుగా సినిమాలు కూడా చేస్తుంది. మంచు మనోజ్ కూడా ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తున్నారు. వీరి వెకేషన్ కు సంబందించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి..