కీర్తికి అన్యాయం చేసిన నిర్మాత...!
అయితే తాజాగా వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే కీర్తి సురేష్ తెలుగులో కాస్త ఎక్కువగా ఇబ్బంది పడుతుందని సమాచారం. ఆమె రెమ్యునరేషన్ విషయంలో కాస్త చూసి చూడనట్టు వ్యవహరిస్తుంటే కొంతమంది దర్శక నిర్మాతలు ఆమెకు మరీ అన్యాయం చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కీర్తి సురేష్ ఇటీవల ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆమెకు మరీ దారుణంగా 40 లక్షలు మాత్రమే ఇస్తానని సదరు నిర్మాత చెప్పారట. దీనితో కీర్తి సురేష్ తాను నిర్మాతలను అర్థం చేసుకున్న సరే నిర్మాతలు మాత్రం ఇలా ప్రవర్తించడం ఎంతమాత్రం భావ్యం కాదని ఆమె నేరుగా అసహనం వ్యక్తం చేసినట్లుగా సమాచారం.
ఏది ఎలా ఉన్నా సరే ప్రస్తుతం వస్తున్న వార్తలు మాత్రం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల ఆమె మహేష్ బాబు హీరోగా వస్తున్న ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనేది తెలియదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చే సినిమాలో కూడా కీర్తి సురేష్ నటించిన అవకాశాలు ఉండవచ్చు అని టాలీవుడ్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. మరి ఏమవుతుంది ఏంటి అనేది చూడాలి.