డబుల్ ఇస్మార్ట్ శంకర్.. పాన్ ఇండియా అటెంప్ట్..!
ఈ సినిమా తర్వాత పూరీ ఫైటర్ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా చేస్తున్నాడు పూరీ జగన్నాథ్. విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ ఆడియెన్స్ కూడా మెచ్చేలా కథ రాసుకున్నాడట. ఇక ఇస్మార్ట్ శంకర్ తర్వాత రాం రెడ్ సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుంది. అయితే మరోసారి పూరీ, రాం కలిసి సినిమా చేస్తారని తెలుస్తుంది.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఈ ఇద్దరు కలిసి డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా చేస్తారని అంటున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఫైటర్ హిట్ అయితే పూరీ రాం తోనే తన నెక్స్ట్ సినిమా చేస్తాడని టాక్. మరి వారిద్దరు చేసే సినిమా డబుల్ ఇస్మార్ట్ శంకరేనా లేక మరేదైనా అన్నది త్వరలో తెలుస్తుంది. ఈసారి మాత్రం మరో క్రేజీ స్టోరీతో ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తారని తెలుస్తుంది. తప్పకుండా డబుల్ ఇస్మార్ట్ శంకర్ డబుల్ కిక్ ఇచ్చేలా ఉంటుందని అంటున్నారు.