కరోనా నుండీ కోలుకున్నారా.. ఇది తప్పక చేయండి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం..?
అటు మరణాల సంఖ్య కూడా చాలా తక్కువ గానే ఉంది. అయితే కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నప్పటికీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాల కే ముప్పు అని సూచిస్తున్నారు వైద్యులు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మరింత జాగ్రత్తగా ఉండాలని.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత రోజులే ఎంతో ముఖ్యమైనవి అంటూ చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు పాటించడంతో పాటు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలని లేకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు.
కరోనా నుంచి కోలుకున్న తరువాత నిర్లక్ష్యంగా ఉంటే గుండె మెదడు కిడ్నీ సమస్యలు తలెత్తే ముప్పు ఉంటుందని... అంతే కాకుండా మరోసారి కరోనా వైరస్ బారిన పడే అవకాశం కూడా ఉంటుంది అందరూ వైద్య నిపుణు లు చెప్తున్నారు. కరోనా రాకముందు ఎంత అప్రమత్తంగా ఉన్నారో కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా అంతకు మించిన అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గుండె, కిడ్నీ, మధుమేహం, కాలేయం ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్ళు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.