క‌రోనా వేళ పార్ట్‌నర్‌తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్న కీర్తి సురేష్‌!!

Kavya Nekkanti

కీర్తి సురేష్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.  నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన కీర్తి సురేష్‌.. మొద‌టి సినిమాతోనే మంచి విజ‌యాన్ని అందుకుంది. మ‌రియు మొద‌టి సినిమాతోనే కీర్తి సురేష్ సినీప్రియుల హృదయాలు దోచుకుంది. 

ఆ త‌ర్వాత న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా తెర‌కెక్కిన నేను లోకల్ చిత్రంలో న‌టించి మ‌ళ్లీ హిట్ కొట్టింది. ఇక ఆ త‌ర్వాత మ‌హాన‌టి చిత్రంలో న‌టించి ఓవ‌ర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది.

మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నట విశ్వరూపం ప్రదర్శించింది.  దీంతో ఆ చిత్రానికి గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. ఇక ఇటీవ‌ల ఈమె న‌టించిన పెంగ్విన్  ఓటిటిలో రిలీజ్ అయ‌న సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం ఈ బ్యూటి మ‌హేష్ సర్కారు వారి పాట చిత్రంతో పాటు మిస్ ఇండియా అనే లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా షూటింగ్స్ లేక‌పోవ‌డంతో ఇంట్లోనే త‌న పార్ట్‌నర్‌తో క‌లిసి ఎంజాయ్ చేస్తుంది.

పార్ట్‌న‌ర్ అంటే లైఫ్ పార్ట్‌న‌ర్ కాదండోయ్‌.. తన పెట్ డాగ్ తో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా త‌న పెట్‌తో క‌లిసి మేక‌ప్ లేకుండా ఫోటో షూట్ కూడా చేసింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: