లడఖ్ లోని గాల్వన్ లోయ వద్ద సోమవారం సాయంత్రం భారత్ - చైనా భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణ లో 20మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తెలంగాణ లోని సూర్యపేట కు చెందిన కల్నల్ సంతోష్ బాబు కూడా వున్నారు. ఇక ఈ ఘటనపై సినీ సెలబ్రెటీలు ట్వీట్ల ద్వారా స్పందించారు. అందులో భాగంగా మహేష్ బాబు ,సాయి ధరమ్ తేజ్,కాజల్ తదితరులు అమర జవాన్ల మృతి కి సంతాపం తెలియజేశారు.
సైనికుల మృతి తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. దేశం కోసం మీరు చేసిన పోరాటాన్ని మేము ఎల్లప్పుడు గుర్తుంచుకుంటాం.. మీ ధైర్య సాహసాలకు బిగ్ సెల్యూట్ అంటూ మహేష్ ట్వీట్ చేయగా గాల్వన్ వ్యాలీ ఘటన లో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికులకు బిగ్ సెల్యూట్.. వారి కుటంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని కాజల్ ,సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.