కరణం మల్లేశ్వరి బయోపిక్ లో హీరోయిన్ ఆమేనా..?

NAGARJUNA NAKKA

అటు తిరిగి ఇటు తిరిగి.. కరణం మల్లేశ్వరి బయోపిక్.. ఓ బాలీవుడ్ హీరోయిన్ దగ్గరకొచ్చి ఆగింది. దాంతో విభిన్న కథానాయికగా దూసుకుపోతున్న ఆ బ్యూటీ అయితే.. పర్ ఫెక్ట్ గా సరిపోతుందని అంటున్నారు. 

 

క్రీడాకారుల బయోపిక్స్ అంటే.. ఆ సినిమా క్రేజ్ వేరేలా ఉంటుంది. వాళ్ల జీవితాల్లోని ఎత్తు, పల్లాలను బేస్ చేసుకొని, వాటికి కమర్షియల్ హంగులు జోడించి, ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శక నిర్మాతలు. అందులో భాగంగా ఒలింపిక్ లో విజయ కేతనం ఎగురవేసిన, తెలుగు అథ్లెట్ కరణం మల్లేశ్వరి బయోపిక్ ను తెరకెక్కించబోతున్నట్టుగా ప్రకటించాడు కోన వెంకట్. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ భూమి ఫడ్నేకర్ నటించనుందట. 

 

ముందుగా ఈ బయోపిక్ కు నిత్యామీనన్ ను అనుకున్నారు. కానీ ఆమె కొన్ని కారణాల వల్ల నో చెప్పింది. ఆ తర్వాత పలువురు ముద్దుగుమ్మల పేర్లు తెరపైకి వచ్చినా.. ఫైనల్ గా భూమి ఫడ్నేకర్ ఖాతాలో పడిపోయింది. ఎలాగు పాన్ ఇండియా లెవల్ మూవీ కాబట్టి.. బాలీవుడ్ హీరోయిన్ అయితే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారట ఫిల్మ్ మేకర్స్. దాంతో కరణం మల్లేశ్వరిగా భూమిని తీసుకున్నట్టు తెలుస్తోంది.

 

ఇటీవలే భూమి ఫడ్నేకర్ ను సంప్రదించగా.. ఆమె ఓకే చెప్పినట్టు సమాచారం. భూమి కూడా కెరీర్ స్టార్టింగ్ లో చబ్బీగా దర్శనమిచ్చి.. ఆ తర్వాత వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ.. విభిన్న నాయికగా దూసుకుపోతోంది. ప్రస్తుతం భాగమతి హిందీ రీమేక్, దుర్గావతిలో నటిస్తోంది భూమి. దాంతో కరణం మల్లేశ్వరి రోల్ తో ఆమె పర్ ఫెక్ట్ గా సూట్ అవుతుందని అంటున్నాయి సినీ వర్గాలు. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. కోన వెంకట్ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ ను సంజన రెడ్డి దర్శకత్వం వహించబోతున్నారు. మొత్తానికి కరణం మల్లేశ్వరి బయోపిక్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: