మహేశ్ హీరోయిన్ ని ఫుల్ గా ఏడిపిస్తున్నారు పాపం !
అమెరికా దేశాన్ని కరోనా వైరస్ మొన్నటివరకు అతలాకుతలం చేసింది. వైరస్ ప్రభావం ఇంకా తగ్గకుండానే అమెరికాలో తెల్లజాతీయులు నల్లజాతీయుల మధ్య గొడవలు నెలకొన్నాయి. నల్ల జాతీయుడు జార్జ్ ప్లాయిడ్ హత్యోదంతంపై అమెరికాలో ఆందోళనలు నిరసనలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. నల్లజాతీయులు అంతా రోడ్డెక్కి తీవ్రస్థాయిలో ఆందోళనలు చేయడంతో అదుపు చేయడానికి పోలీసులు వెళుతున్న వారిపై తీవ్రస్థాయిలో ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆందోళనకారులపై రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడంతో మరింత ఉదృతంగా అమెరికాలో ఆందోళనలు నెలకొన్నాయి.
దీంతో ప్రపంచ స్థాయిలో జార్జ్ ప్లాయిడ్ హత్యోదంతంపై చాలా మంది స్పందిస్తున్నారు. నిరసనకారులకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రముఖులు బ్లాక్ లైవ్స్ మేటర్ తో సపోర్ట్ చేస్తున్నారు. ఈ విధంగానే సోషల్ మీడియాలో మహేష్ బాబుతో నటించిన కియారా అద్వానీ నల్ల జాతీయులకు మద్దతుగా పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆమెను ఫుల్ గా నెటిజన్లు ఏడిపిస్తున్నారు. కియారా అద్వానీ ఫెయిర్నెస్ క్రీమ్కు బ్రాండ్ అంబాసిడర్.
నల్ల చర్మంకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ తెలుపు చర్మం పట్ల మమకారం చూపించే నీకు ఈ విషయంలో స్పందించే హక్కు ఎక్కడిది అంటూ సెటైర్లు వేస్తున్నారు. నల్లని చర్మం ఉంటే నీకు నచ్చదు కదా మరి ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావ్ అని మరి కొంతమంది ఎగతాళి చేస్తున్నారు. అన్నట్లుగా ఆ ఫెయిర్ నెస్ క్రీమ్కు అంబాసిడర్గా వ్యవహరిస్తున్నావు. కనుక నీవు ఈ విషయంలో స్పందించవద్దంటూ ఆమెను టార్గెట్ చేసి నెటిజన్లు సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు.