నిశ్శబ్దం... గత కొన్ని రోజుల నుండి తరుచూ వార్తల్లో నిలుస్తుంది. మేకర్స్ రిలీజ్ విషయంలో పదే పదే క్లారిటీ ఇచ్చినా కూడా సినిమా థియేటర్ల లో కాకుండా డైరెక్ట్ గా ఓటిటి లో రానుందని వార్తలు వస్తూనే వున్నాయి. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈచిత్రానికి బోర్డు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అంతేకాదు సినిమా చూసి బోర్డు సభ్యులు ఇచ్చిన రెస్పాన్స్ అమితానందానికి గురి చేసింది వారికి నా ధన్యవాదాలు... సినిమా ను మొదట థియేటర్లలో విడుదలచేయమని వారు సూచించారని ఈసందర్భంగా నిశ్శబ్దం డైరెక్టర్ హేమంత్ మధుకర్ ట్వీట్ చేశాడు అయితే ఆగస్టు వరకు థియేటర్లు తెరుచుకోనే పరిస్థితి లేదు మరి అప్పటివరకు ఆగుతారో లేదో చూడాలి. ఈసినిమా డిజిటల్ హక్కులను అన్ని భాషలకు కలిపి అమెజాన్ ప్రైమ్ 26కోట్లకు దక్కించుకుంది. శాటిలైట్ రైట్స్ ద్వారా మరో 10కోట్ల వరకు వస్తుంది కాబట్టి ఎటు తిరిగి నిర్మాతలకు మాత్రం ఈచిత్రం లాభాలనే అందించనుంది.
సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటించగా మాధవన్ ,సుబ్బరాజు, అంజలి షాలిని పాండే తో పాటు హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. గోపి సుందర్ సంగీతం అందించాడు. సుమారు 30కోట్ల బడ్జెట్ తో కోన వెంకట్, టిజి విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.