ఇటీవల భాగీ 3 సినిమాతో మరో సూపర్ హిట్ ను తన ఖాతా లో వేసుకున్న యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తన సోషల్ మీడియా పేజ్లో ఓ భావోద్వేగా పోస్ట్ చేశాడు. తన పెంపుడు పిల్లి జేడీ మృతి చెందటంతో టైగర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఈ సందర్బంగా ఆయన తన బాధను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
`నీకు దేవుడి ఆశీస్సులు ఉంటాయి సోదరా. 17 ఏళ్ల పాటు మాకు ఆనందాన్ని ప్రేమను పంచినందుకు ధన్యవాదాలు. ప్రతీ జన్మలోనూ నువ్వు మా దగ్గరకు వస్తావని ఆశిస్తున్నా. తిరిగి మనం కలుసుకునే వరకు నువ్వు ఎక్కడ ఉన్నా ఆనందంగా ఆరోగ్యంగా ఆడుపాడుతూ ఉండాలని ఆశిస్తున్నా. నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను` అంటూ పోస్ట్ చేశాడు టైగర్. ఈ కామెంట్ తో పాటు జేడీ ఫోటోను కూడా పోస్ట్ చేశాడు టైగర్ ష్రాఫ్.
టైగర్ మాత్రమే కాదు ఆయన కుటుంబ సభ్యులు కూడా సోషల్ మీడియా వేదికగా తమ బాధను వ్యక్తం చేశారు. టైగర్ చేసిన పోస్ట్ ను ఆయన తండ్రి జాకీ ష్రాఫ్ రీ పోస్ట్ చేయగా. ఆయన తల్లి అయేషా `గుడ్ బై జేడీ నువ్వు 17 ఏళ్ల పాటు మాకు స్వచ్చమైన ప్రేమను అందించావు` అంటూ కామెంట్ చేసింది.
auto 12px; width: 50px;">
View this post on Instagram
God bless you my brother❤thank you for 17 years of only happiness and love. hope you come back to us in every lifetime. Until then wherever you are be happy healthy and keep playing until i come join you again! I
{{RelevantDataTitle}}