పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన థమన్!
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవన్ కళ్యాన్. మెగాస్టార్ చిరంజీవి కి వచ్చినంత మాస్ ఫాలోయింగ్ సంపాదించారు పవన్ కళ్యాన్. అదే రీతిలో అన్నయ్య బాటలో నడుస్తూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతే కాదు జనసేన పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళ్లారు. గత ఏడాది ఏపిలో జరిగిన ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. కానీ తన ప్రయత్నాలు ఎప్పుడు కొనసాగిస్తూనే ఉంటానని.. ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తానని.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని అంటున్నారు పవన్ కళ్యాన్. అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాన్ నటించిన ‘అజ్ఞాతవాసి’ ఆయన ఆఖరి సినిమా. ఈ మూవీ తర్వాత పూర్తిగా రాజకీయాలవైపు వెళ్లారు. అయితే రాజకీయాల్లో ఉన్న సమయంలో పవన్ సినిమాల్లో నటించరని రూమర్లు వచ్చాయి.
కానీ ఆయన ప్రస్తుతం వరుసపెట్టి సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పింక్ రిమేక్ లో నటిస్తున్నారు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన వైకుంఠపురంలో సినిమాతో సూపర్ ఫార్మ్ లోకి వచ్చాడు ఎస్ఎస్ థమన్. ఆ మూవీ సాంగ్స్ పెద్ద సెన్సేషన్ కాగా ఆయన ఖాతాలో ఓ బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. ఇక థమన్ చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం పవన్ నటిస్తున్న పింక్ మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా నిన్న సోషల్ మీడియా వేదికగా పవన్ ఫ్యాన్స్ కి థమన్ ఓ తీపి కబురు పంచారు.
పింక్ రీమేక్ కి సంబంధించి ఆయన కొన్ని పవన్ కళ్యాణ్ పిక్స్ చూశారట. పింక్ రీమేక్ కోసం శక్తి వంచన లేకుండా పనిచేసి బెస్ట్ ట్యూన్స్ ఇస్తానని మాట ఇస్తున్నాడు. థమన్ మాస్, క్లాస్ రెండింటి విషయంలోనూ ది బెస్ట్ అనిపించుకున్నాడు. మరి పవన్ కళ్యాన్ సినిమాకు ఏ రేంజ్ లో మ్యూజిక్ అందిస్తారో చూడాలి. క దిల్ రాజు ఈ మూవీ నిర్మిస్తుండగా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.