స‌రిలేరు నీకెవ్వ‌రు: భారం అంతా మ‌హేష్ మీదే.. ఈ టాక్‌తో రు.101 కోట్ల షేర్ వ‌స్తుందా..?

Arun Showri Endluri
పండుగ సీజన్ లో సూపర్ స్టార్ మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో తన ప్రేక్షకులతో కలిసి సందడి చేయడానికి ఈరోజు వచ్చేశాడు. చాలా రోజుల తర్వాత తన కెరీర్లో యువ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన మహేష్ తనలో ఇన్నిరోజులు దాచి పెట్టిన ఒక అద్భుతమైన కోణాన్ని ఈ సినిమా ద్వారా వెలికి తీశాడు అనే చెప్పాలి. సినిమా మొత్తం మాస్ ఎలిమెంట్స్ తో ఫ్యాన్స్  చొక్కాలు చించుకునే  సీన్లు పెట్టిన అనిల్ రావిపూడి న్యూట్రల్ ఆడియన్స్ దగ్గర్నుంచి మాత్రం యావరేజ్ టాక్ ను తెచ్చుకున్నాడు.

అనిల్ రావిపూడి అంటే ముఖ్యంగా ప్రేక్షకులకి గుర్తొచ్చేది పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునే కామెడీ. కానీ ఈ చిత్రంలో కామెడీ కొంచెం బలవంతంగా పెట్టినట్లు ఉండగా ఆ కామెడీ కనుక జనాల్లోకి ఎక్కితే సినిమా ఎబొవ్ యావరేజ్ కావచ్చు. ఇక ఈ సినిమా కలెక్షన్ల భారం అంతా సూపర్ స్టార్ మహేష్ మేనియా పైనే ఆధారపడి ఉంది. అంతేకాకుండా ఈ చిత్రం భవిష్యత్తు రేపు విడుదల కాబోయే అల వైకుంఠపురం మీద కూడా ఆధారపడి ఉంది.

మొత్తానికి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే అక్షరాల 101 కోట్ల రూపాయల షేర్ రావాలి. అంటే కనీసం 160 నుండి 170 కోట్లకు పైగా గ్రాస్ తీసుకొని రావాలి. అయితే దర్బార్, అల వైకుంఠపురం లో మరియు జాతీయ అవార్డు పొందిన సినిమాకి దర్శకత్వం వహించిన సతీష్ వేగ్నేశ యొక్క 'ఎంత మంచి వాడవురా' సినిమాల మధ్య ఈ టాక్ తో ఆ ఫిగర్ ను అందుకోవడం అనేది చాలా పెద్ద విషయం. ఇక ఇంత పోటీ మధ్య మహేష్ ఆ నెంబర్ ను దాటాడు అంటే అది కేవలం అతని మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ ద్వారానే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: