తెలుగు ప్రేక్షకుల అభిమానంపై రజిని సూపర్ కామెంట్..!

shami

సూపర్ స్టార్ రజినికాంత్ తమిళ హీరోనే అయినా ఆయనకు ఇండియా మొత్తం ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలుగులో సూపర్ స్టార్ రజినికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రజిని సినిమా అంటే తమిళంలో ఎలాంటి క్రేజ్ ఉంటుందో దానికి సమానంగా తెలుగులో కూడా అదే క్రేజ్ ఉంటుంది. ఇక్కడ స్టార్ హీరోలతో సమానంగా రజిని సినిమాలు రిలీజ్ అవుతాయి. 70 ఏళ్ల వయసులో కూడా ఇంకా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు రజినికాంత్. లేటెస్ట్ గా మురుగదాస్ డైరక్షన్ లో దర్బార్ సినిమా చేశారు రజినికాంత్. ఈ సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.

 

రీసెంట్ గా శిల్పకళా వేదికలో జరిగిన ఈ ఈవెంట్ లో తనకోసం వచ్చిన ఫ్యాన్స్ అందరిని చూసి షాక్ అయ్యారు. తమిళ ప్రేక్షకులతో పాటుగా తెలుగు ఆడియెన్స్ కూడా తనని అక్కున చేర్చుకున్నారని. తెలుగులో మొదటిసారిగా అంతులేని కథ సినిమా చేశానని.. భాషా, నరసిం హా, అరుణాచలం, ముత్తు, చంద్రముఖి, రోబో ఇలా నేను చేసిన ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది. ఆ సినిమాను మీరు కూడా ఆదరించారని అన్నారు రజినికాంత్. తెలుగు ఆడియెన్స్ అభిమానాన్ని పొందడం నా భాగ్యమని అన్నారు రజిని.

 

రజిని చేశాడు కాబట్టి ఆ సినిమాలు హిట్ అవలేదని.. ఆ కథలు బాగున్నాయి.. అందులో రజినికాంత్ బాగా చేశాడు కాబట్టి సినిమాలు హిట్ అయ్యాయని అన్నారు. కొన్ని సినిమాలు షూటింగ్ చేస్తున్న టైం లోనే ఓ మ్యాజిక్ జరుగుతుంది. ఆ మ్యాజిక్ జరిగిన ప్రతి సినిమా హిట్ అయ్యింది. మురుగదాస్ డైరక్షన్ లో చేసిన ఈ సినిమాలో కూడా నాకు ఆ మ్యాజిక్ జరిగిందని అన్నారు రజినికాంత్. మురుగదాస్ తో 15 ఏళ్లుగా సినిమా కోసం ప్రయత్నిస్తున్నాను.. ఇన్నాళ్లకు ఆయనతో సినిమా తీయడం కుదిరిందని అన్నారు. దర్బార్ సినిమాపై సూపర్ స్టార్ రజినికాంత్ సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. సంక్రాంతికి పోటీగా మహేష్, అల్లు అర్జున్ సినిమాలు వస్తున్నాయి. మరి వాటి ధాటికి రజిని సినిమా ఏమాత్రం నిలబడుతుందో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: