కార్తి నటించిన ఖైదీ ఇటీవల విడుదలై తమిళం తోపాటు తెలుగులోనూ భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈచిత్రంలో విలన్ గా నటించి మెప్పించాడు తమిళ నటుడు అర్జున్ దాస్. డ్రగ్స్ తీసుకొనే వారు ఎలా ప్రవర్తిస్తారో అచ్చం అలానే చేసి విలనిజాన్ని పడించడం లో సక్సెస్ అయ్యాడు అర్జున్ . ఇక ఈ సినిమా ద్వారా అర్జున్ కు ఇప్పుడో ఓ భారీ ఆఫర్ వచ్చింది.
ఖైదీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం ఇళయదళపతి విజయ్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈసినిమాలో ఓ కీలక పాత్ర కోసం అర్జున్ దాస్ ను తీసుకున్నారు. తాజాగా ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మెయిన్ విలన్ గా నటిస్తుండగా పేట ఫేమ్ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. క్యాస్టింగ్ తోనే ఈ సినిమా అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.
గత కొద్దీ రోజులు నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదలకానుంది. ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ చెన్నై లో జరగనుండగా ఈ షెడ్యూల్ లో విజయ్ సేతుపతి జాయిన్ కానున్నాడు. కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఎక్స్ బి ప్రొడక్షన్స్ నిర్మించనుంది.ఈచిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవి ఛానెల్ సన్ టీవి భారీ ధరకు సొంతం చేసుకుంది.అయితే ఈ డీల్ విలువ ఎంతో తెలియాల్సి వుంది.