బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగి ఫైనల్ వరకు వెళ్లిన అలీ రెజా తాజాగా ఓ లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. అదేంటంటే చాలా కాలం గ్యాప్ తరువాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం రంగ మార్తాండ అనే సినిమా ను తెరక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్టార్ అయ్యింది. ఈచిత్రంలో అలీ రెజా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం అయన ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇంతకుముందు రామ్ చరణ్ నటించినధృవ లో పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పించాడు అలీ.
ప్రముఖ నటుడు మహేష్ మంజ్రేకర్ డైరెక్షన్ లో నానా పటేకర్ లీడ్ రోల్ నటించిన చిత్రం నట్ సామ్రాట్' 201ి6లో విడుదలై సూపర్ హిట్టైన ఈ మరాఠా కల్ట్ మూవీకి రీమేక్ గా తెరక్కుతున్న రంగమార్తాండలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ,కృష్ణ వంశీ సతీమణి రమ్యకృష్ణ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా అలీ రెజా తోపాటు ప్రముఖ యాంకర్ కమ్ నటి అనసూయ హ్యాపీడేస్ ఫేమ్ వంశీ చాగంటి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడున్నాయి. రెడ్ బుల్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై అభిషేక్ జ్వకర్ , మధు కలిపు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది.
ఇక కృష్ణవంశీ గత చిత్రం నక్షత్రం దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమా దెబ్బతో ఏకంగా ఆయన రెండు ఏళ్ళు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు రంగమార్తాండ తోనైనా హిట్టు కొట్టి కృష్ణవంశీ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.