ప్రభాస్ కి ఊహించని షాక్ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్..!
ఇటువంటి నేపథ్యంలో ప్రభాస్ పక్కన నటించే అవకాశం వస్తే రకుల్ ప్రీత్ సింగ్ నో చెప్పినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని తెలిపింది. విషయంలోకి వెళ్తే మోడలింగ్ లో ఉన్న సమయంలో మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం నన్ను సంప్రదించారు. కానీ ఆ సమయంలో నాకు సినిమాల గురించి అవగాహన లేదు. మోడలింగ్ లోనే రాణించాలని అనుకునేదాన్ని. అప్పట్లో సినిమాల పట్ల ఆసక్తి లేక ప్రభాస్ చిత్రానికి నో చెప్పానని రకుల్ అంటోంది. కొంతకాలానికి వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.
ఆ చిత్రం విజయం సాధించడం.. రకుల్ గ్లామర్ కు అంతా ఆకర్షితులు కావడంతో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. దీంతో ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది స్టార్ హీరోలతో రకుల్ ప్రీత్ సింగ్ నటించడం జరిగింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లో కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు సీక్వెల్ లో నటించి తాజాగా సినిమా విడుదల అయ్యి ఫ్లాప్ అవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు కోసం ఎదురుచూస్తోంది.