విక్టరీ వెంకటేశ్, యువ సామ్రాట్ నాగచైతన్య హీరోలుగా రూపొందుతున్న మల్టీస్టారర్ `వెంకీమామ`. కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ను అక్టోబర్ 8న విజయదశమి సందర్భంగా విడుదల చేస్తున్నారు. ఈ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్కు సంబంధించిన పోస్టర్ను విడుదల చేసిన మేకర్స్ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలను తెలియజేశారు.
ఈ కలర్ఫుల్ పోస్టర్ చూస్తే ..ఓ ట్రాక్టర్లో వెంకటేశ్, నాగచైతన్య, పాయల్ రాజ్పుత్, రాశీఖన్నా ఉన్నారు. ప్రస్తుతం సినిమా రామోజీ ఫిలింసిటీలో వేసిన ఓ భారీ సెట్లో పాట చిత్రీకరణను జరుపుకుంటోంది.
తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఇందులో నిజ జీవితంలో మామా అల్లుళ్లుగా ఉన్న వెంకటేష్ - నాగ చైతన్యలు వెండితెరపై కూడా అదే పాత్రల్లో కనిపించనున్నారు. విభిన్నమైన కథాకథనాలతో పూర్తి వినోదభరితంగా ఈ సినిమా సాగనుంది. యూత్.. మాస్.. ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో ఈ కథను తీర్చిదిద్దినట్టుగా చెబుతున్నారు.
అయితే, ఈ చిత్రాన్ని విజయదశమికి రిలీజ్ చేయాలని భావించారు. కానీ, ఆ సమయంలో పోటీ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా, అక్టోబరు రెండో తేదీన మెగాస్టార్ చిరంజీవి "సైరా నరసింహా రెడ్డి" చిత్రం విడుదలయింది. దీంతో డిసెంబరు మొదటి వారంలో ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఎఫ్ 2' తరువాత వెంకటేశ్ నుంచి వస్తోన్న మరో వినోదభరిత చిత్రం కావడంతో, అభిమానుల్లోను అంచనాలు వున్నాయి.
వెంకటేశ్, నాగచైతన్య, రాశీఖన్నా, పాయల్ రాజ్పుత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
దర్శకత్వం: కె.ఎస్.రవీంద్ర(బాబీ) నిర్మాతలు: సురేష్బాబు, టీజీ విశ్వప్రసాద్, కో ప్రొడ్యూసర్: వివేక్ కూచిబొట్ల, మ్యూజిక్: ఎస్.ఎస్.తమన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, ఎడిటర్: ప్రవీణ్ పూడి, పి.ఆర్.ఒ: వంశీ శేఖర్.