ఏపీ: అమరావతి కోసమే ఆ త్యాగం చేశా: పవన్ కల్యాణ్
ఇక ఆ పశ్చిమ సీటుని దానం చేసినపుడు పవన్ రెండే అడిగారట. ఒకటి అమరావతి, రెండు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాపాడాలని. దానికి వాళ్లు అంగీకరించడంతో సీటును వదులుకున్నాను అని పవన్ తన దయార్ద్ర హృదయాన్ని చాటుకున్నాడు. కాగా పశ్చిమలో నేను తీర్చిదిద్దిన నాయకుడే ఇప్పుడు వైకాపా మాయలో పడి నన్ను తిట్టడం మొదలు పెట్టాడు. కానీ.. నేను ఇలాంటి వాటికి భయపడను. నేను అతడిని క్షమిస్తున్నానని పోతిన వెంకట మహేశ్ గురించి పరోక్షంగా పవన్ ఇక్కడ ప్రస్తావించడం కొసమెరుపు.
అవును, రాష్ట్రంలో అరాచక పాలన పోవాలనే.. పవన్ కల్యాణ్ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. మేమేం పదవులపై ఆశతో రాలేదు, కేవలం ప్రజా సేవ చేయడానికి వచ్చాం. విజయవాడలోని ఈ పంజాసెంటర్ను వైకాపా మూకలు గంజాయికి కేంద్రంగా మార్చివేశాయి. చీడ పురుగుల పాలనలో మనం వున్నాం. ఈ దుష్టపాలన పోగొట్టాలంటే.. మే 13న కూటమికి ఓటేసి గెలిపించండి. పవన్ కల్యాణ్ వల్లే ఈరోజు కూటమి ఏర్పాటు సాధ్యమైంది. మళ్లీ కూటమి రాకతోనే.. ఈ రాష్ట్రం బాగుపడుతుంది. గత ఐదేళ్లలో.. తాను 130 సార్లు బటన్ నొక్కానంటూ చెప్పుకొంటున్న జగన్.. అసలు తానెంత నొక్కారో బయట పెడితే బావుంటుంది... అంటూ పవన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు.