యంగ్ హీరో శర్వానంద్ నటించిన రణరంగం సినిమా గురువారం థియేటర్లలోకి వచ్చింది. మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరున్న సుధీర్వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎలాంటి హడావిడి, ప్రమోషన్లు లేకుండా రిలీజ్ అయ్యింది. `పడి పడి లేచే మనసు` చేసిన తర్వాత శర్వానంద్ నటించిన చిత్రమిది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. గురువారమే మరో హీరో అడవి శేష్ నటించిన ఎవరు సినిమా హంగామాతో పాటు, ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు, సోషల్ మీడియా హడావిడితో స్టార్ట్ అయ్యింది.
శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శని జంటగా నటించిన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. గత వారం రిలీజ్ అయిన నాలుగు సినిమాలు ప్లాప్ అవ్వడంతో అటు ఎవరుతో పాటు ఇటు రణరంగం సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర మంచి ఛాన్స్ వచ్చినట్లయ్యింది. ఎవరు సినిమాతో పోలిస్తే రణరంగంకు ప్రి రిలీజ్ బజ్ కూడా తక్కువగానే ఉన్నట్టు కనిపించింది.
తొలి రోజు రణరంగం రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ 3.8 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమాకు రూ.16 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.13 కోట్ల వరకు బిజినెస్ జరగగా... మిగిలిన రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలుపుకుంటే రూ.3 కోట్ల బిజినెస్ జరిగింది.
ఇక ఈ సినిమాకు పోటీగా వచ్చిన ఎవరు బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. మల్టీఫ్లెక్స్లతో పాటు బీ, సీ సెంటర్లలో కూడా ఆ సినిమాకు ప్రేక్షకాదారణ ఉంది. వాస్తవంగా చూస్తే అడవి శేష్తో పోలిస్తే శర్వాది పెద్ద మార్కెట్. అయినా అడవి శేష్ సినిమా దూసుకుపోతుంటే శర్వా రణరంగం ఇలా డీలాపడడంతో అందరూ షాక్ అవుతున్నారు.