దయనీయ పర్థితిలో ఆ హీరోయిన్!

Edari Rama Krishna
సీనీ ప్రపంచంలోకి ఒక్కసారి అడుగు పెడితే తమ జాతం మొత్తం మారిపోతుందని భావించే వారు ఎంతో మంది ఉన్నారు. అందుకోసం ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు స్టూడియోల వెంట పడిగాపులు కాస్తుంటారు.  అయితే వెండి తెరపై ఛాన్స్ వచ్చినా కూడా కొంత మంది జాతకాలు మారవు సరికదా..కష్టాలపాలైన వారు ఎంతో మంది ఉన్నారు.  రీల్ లైఫ్ లో ఎంతో హంగులూ ఆర్భాటాలు ఉన్నవారు..రియల్ లైఫ్ లో కష్టాలు పడుతుంటారు.  తాజాగా ఇప్పుడు ఓ సినీ నటి జీవిత పరిస్థితి కూడా ఇలాగే తయారైనట్లు వార్తలు వస్తున్నాయి. 

ఆ మద్య అర్జున్, జగపతిబాబు కాంబినేషన్ లో వచ్చిన ‘హనుమాన్ జంక్షన్’చిత్రంలో చెల్లెలి పాత్రలో నటించినే విజయలక్ష్మి పరిస్థితి చాలా దయనీయంగా ఉందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  ఈ చిత్రంలో హీరో వేణు ప్రేమిరాలిగా నటించింది.  కన్నడలో ఆమె నాగమండల, సూర్యవంశ వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల విజయలక్ష్మి తల్లి తీవ్ర అనారోగ్యం బారినపడి ఆసుపత్రిపాలైంది.  ఉన్న డబ్బంతా తల్లి కోసమే ఖర్చు చేసింది విజయలక్ష్మి. అంతలోనే తాను సైతం అనారోగ్యంపాలైంది. 

ఆమె పరిస్థిగి బాగా విషమించడంతో ఐసియూలో చికిత్స చేయాల్సిన పరిస్తితి వచ్చిందట.  దాంతో బాగా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చిందట. అ నేపథ్యంలో విజయలక్ష్మి కుటుంబం ఆసుపత్రి బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. ఈ మేరకు విజయలక్ష్మి సోదరి ఉషాదేవి ఓ ప్రకటన చేసింది.

తన తల్లి, సోదరి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, తమ వద్ద ఉన్న డబ్బంతా అయిపోయిందని, ఎవరైనా ముందుకొచ్చి సాయంచేస్తేనే తల్లిని, సోదరిని కాపాడుకోగలనని దీనంగా వేడుకుంది ఉషాదేవి.   ఆమె సోదరి ఉషాదేవి చేసిన ప్రకటనతో కన్నడ ఫిలించాంబర్ స్పందించి ఆర్థికసాయం అందజేసింది. విజయలక్ష్మి త్వరగా కోలుకోవాలని ఫిలించాంబర్ సభ్యులు ఆకాంక్షించారు. ప్రస్తుతం విజయలక్ష్మి బెంగళూరులోని మాల్యా హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: