టాలీవుడ్ లో టాప్ పొజీషన్ లో ఉన్న అక్కినేని ఫ్యామిలీలో ఈ మద్య ఓ పెళ్లి అయ్యింది..వెంటనే మరో పెళ్లా అని అనుకుంటున్నారా..అబ్బే మీరు అనుకునే నాగార్జున ఫ్యామిలీ కాదు..ప్రముఖ ఎడిటర్ అక్కినేని శ్రీకర్ ప్రసాద్. మరి ఆ పెళ్లి కూతురు ఎవరో తెలుసా..లెజండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన తమిళ చిత్రం ‘కన్నత్తిల్ ముత్తమిట్టల్’ (తెలుగులో ‘అమృత’). ఈ చిత్రంలో నటించిన కీర్తన.. మరి ఈ కీర్తన ఎవరో తెలుసా..సీనియర్ తమిళ నటులు పార్తీబన్, సీత గారాల పట్టి.
అంత చిన్న వయసులో..‘అమృత’ చిత్రంలో మాధవన్, సిమ్రాన్, జేడీ చక్రవర్తి, నందితా దాస్ వంటి హేమాహేమీలు నటించినప్పటికీ.. గుర్తింపు దక్కించుకుంది మాత్రం అందులో చిన్నారి అమృత పాత్రలో నటించిన కీర్తన. ఆ పాత్రతో ఏకంగా జాతీయ అవార్డును కూడా అందుకుంది. తాజాగా కీర్తన పెళ్లి చేసుకోబోతున్నది సినిమాకి చెందిన వ్యక్తినే.
ప్రముఖ ఎడిటర్ అక్కినేని శ్రీకర్ ప్రసాద్ తనయుడు, హిందీ ‘పిజ్జా’ దర్శకుడు అక్కినేని అక్షయ్ను కీర్తన పరిణయమాడనుంది. మార్చి 8న కీర్తన, అక్షయ్ కల్యాణం జరుగనుంది. ట్విస్ట్ ఏంటంటే.. ‘అమృత’ ఎడిటర్ మరెవరో కాదు.. కీర్తనకి కాబోయే మామగారు శ్రీకర్ ప్రసాద్నే.