బాలకృష్ణ ‘జైసింహ’ పూర్తి కలెక్షన్లు..!

Edari Rama Krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మద్య నందమూరి బాలకృష్ణ మంచి ఫామ్ లో ఉన్నారు.   ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన బాలకృష్ట గత సంవత్సరం క్రిష్ దర్శకత్వంలో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్రంతో నటించారు..ఈ చిత్రం ఆయనకు వందవ చిత్రం కావడం విశేషం.  అయితే ఆ తర్వాత 101 చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘పైసా వసూల్’ లాంటి ఫుల్ లెన్త్ మాస్ చిత్రంలో నటించారు.  ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో ‘జై సింహ’ గా సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. 


మొదటి నుంచి కూడా బాలకృష్ణకి సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువ. సంక్రాంతికి తన సినిమా విడుదలైతే తప్పకుండా హిట్ దక్కుతుందని ఆయన భావిస్తుంటారు. అందువలన సాధ్యమైనంత వరకూ సంక్రాంతికి తన సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటూ వుంటారు. గత సంవత్సరం కూడా గౌతమి పుత్ర శాతకర్ణి సంక్రాంతి బరిలోనే దింపారు.

ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ కూడా రిలీ అయ్యింది. అయినా కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో రెండు సినిమాలు పోటీపడీ మరి నడిచాయి.  ఇదే సెంటిమెంట్ తో బాలకృష్ణ ఈ సంక్రాంతికి ఆయన 'జై సింహా' థియేటర్స్ లో వుండేలా చూసుకున్నారు. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా, భారీ వసూళ్లను సాధించింది.

బాలకృష్ణ సరసన నయనతార .. నటాషా దోషి .. హరిప్రియ నటించిన ఈ సినిమా మొత్తం వసూళ్లను పరిశీలిస్తే, ఒక్క తెలంగాణలోనే 5.25 కోట్ల షేర్ ను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 28.25 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 35.85 కోట్ల షేర్ ను సాధించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: