మాస్ మహరాజ్ రవితేజ రాజా ది గ్రేట్ లాంటి హిట్ సినిమా తర్వాత చేసిన సినిమా టచ్ చేసి చూడు. రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా రాజకీయ నాయకుల నీచ రాజకీయాలకు ఎలా అడ్డుకట్టవేశాడో అన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. రవితేజ సరసన రాశీఖన్నా, సీరత్కపూర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో విక్రమ్ సిరికొండ అనే కొత్త దర్శకుడు పరిచయం అయ్యాడు. నల్లమలుపు బుజ్జి - వల్లభనేని వంశీమోహన్ నిర్మాతలుగా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్ షోలు కూడా కంప్లీట్ అయ్యాయి. ప్రీమియర్ల తర్వాత ఈ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చిందో ? చూద్దాం.
సినిమా ఫస్టాఫ్ చూస్తే బోరింగ్గా ఉంటుంది. ఎక్కడా స్పీడప్ ఉండదు. పోలీస్ ఆఫీసర్ అయిన రవితేజకు రాశీఖన్నాకు మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సీన్లతో పాటు రెండు మూడు డ్యూయెట్లు మినహా సినిమా అంతా చాలా చాలా మామూలుగా నడుస్తుంది. రవితేజ నటన మాత్రం ఓకే. ఫస్టాఫ్లో అసలు కథలోకి ఎంటర్ అయ్యాక ఇంటర్వెల్ ట్విస్ట్తో సెకండాఫ్పై ఆసక్తి స్టార్ట్ అవుతుంది. ఫస్టాఫ్లో ఇంటర్వెల్ వదిలేస్తే హైలెట్స్ లేవంటే ఎంత భారంగా నడిచిందో అర్థం చేసుకోవచ్చు.
సెకండాఫ్లో అయినా ఏదో ఉంటుందని ఆశిస్తే నిరాశే ఎదురవుతుంది. బలహీనమైన కథకు తోడుగా ఉన్న సాగదీత కథనంతో సినిమా ముందుకు వెళుతుంది. రవితేజ సినిమా అంటే రవితేజ మార్క్ యాక్షన్ ఆశిస్తారు. టచ్ చేసి చూడులో ఆ యాక్షన్తో పాటు కామెడీ కూడా మిస్ అయ్యింది. సెకండాఫ్లో వచ్చే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే కాస్త మాస్ ప్రేక్షకులకు పెద్ద రిలీఫ్. ఓవరాల్గా బోరింగ్ ఫస్టాఫ్కు తోడుగా సెకండాఫ్లో కొన్ని మాస్ ఎలిమెంట్స్ తప్పా ఏం లేవు.రవితేజ టచ్ చేసి చూడుతో బాక్సాఫీస్ దగ్గర గట్టెక్కడం కష్టంగానే కనిపిస్తోంది.