తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది నటీ నటులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇదే వరసులో చేరారు అక్కినేని నాగ చైతన్య, సమంత. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ఏం మాయ చేసావే’ చిత్రం షూటింగ్ సమయంలో ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొంత కాలంగ ప్రేమించుకున్న ఈ జంట ‘మనం’ చిత్రం తర్వాత పెద్దల ఆశిస్సులు తీసుకొని అక్టోబర్ 6న హిందూ సంప్రదాయం లో అక్టోబర్ 7న క్రిస్టియన్ పద్దతిలో రెండు సంప్రదాయాల్లో జరిగిన సంగతి తెలిసిందే.
ఇక 'రాజుగారి గది 2' ప్రమోషన్లో భాగంగ సమంత కొన్ని విషయాలు మీడియాతో షేర్ చేసుకుంది. తాను నటించిన మొదటి చిత్రం ‘ఏం మాయ చేశావే’ సూపర్ హిట్ అయ్యింది. అప్పట్లో నాగ చైతన్య-సమంత మొదటి సినిమా 'ఏ మాయ చేసావే' 50 రోజుల వేడుకని చిత్రయూనిట్ ఘనంగా జరిపింది. ఆ వేడుకకి అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా హాజరయ్యారు.
కాగా ఆ వేడుకలో అక్కినేని నాగేశ్వర్ రావు సమంతకి ఒక మంచి కంప్లిమెంట్ ఇచ్చారట. నాగ చైతన్యకి 49% మార్కులు వేస్తే సమంతకు మాత్రం 51% మార్కులు ఇచ్చారట. తన రూపురేఖలు..నటన అచ్చం మహానటి సావిత్రిని పోలి ఉన్నాయని అన్నారు.
ఆమె కళ్లు ఒక్కటే కాదు ఆమె స్కిన్ టోన్ కూడా సావిత్రి మాదిరిగానే హావభావాలను పలికిస్తోందని చెప్పారట. అంత గొప్ప నటుడు ఆ మాట అనడంతో నాకు ఎక్కడలేని సంతోషం కలిగింది. అప్పుడు ఆ వేడుకలో నాగార్జున, నాగ చైతన్యతో పాటు సమంత కూడా ఉన్నారట.