చరణ్ రంగస్థలం గురించి అదిరిపోయే న్యూస్..!

shami
మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్న రంగస్థలం 1985 సుకుమార్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నాన్నకు ప్రేమతో తర్వాత సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ రంగస్థలం పల్లెటూరి ప్రేమకథగా రాబోతుంది. ఇక ఈ సినిమాలో రాం చరణ్ కొత్త లుక్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తుందట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా చేస్తుంది.


ఇక ఈ సినిమాకు సుకుమార్ తన ఎప్పటిలానే లాజికల్ థింగ్స్ అన్నిటిని పక్కనపెట్టేసి క్లీన్ అండ్ క్లియర్ గా సినిమా చేయబోతున్నాడట. అంతేకాదు ఈ సినిమాకు సంబందించిన క్రేజీ న్యూస్ ఏంటంటే సినిమాలో కొన్ని సీన్స్ రెండు వర్షన్స్ లో షూట్ చేస్తున్నారట. ముఖ్యంగా క్లైమాక్స్ మాత్రం రెండు వేరు వేరు వర్షన్స్ షూట్ చేస్తున్నారట.


మాస్ ఆడియెన్స్ కు దగ్గరయ్యేలా సినిమా ఉంటుందని చెబుతుండగా ఈ రంగస్థలానికి సంబందించిన ప్రతి విషయం మెగాస్టార్ చిరంజీవి పర్యవేక్షణలోనే జరుగుతుందని తెలుస్తుంది. సినిమా మొత్తం పూర్తయ్యాక చిరు ఏది ఫైనల్ చేస్తే అది ఉంచుతారట. ధ్రువ తర్వాత రాం చరణ్ చేస్తున్న ఈ రంగస్థలం మీద అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 


ఈ సినిమాలో అనసూయ కూడా ఓ స్పెషల్ రోల్ లో కనిపిస్తుండగా ఐటం సాంగ్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీస్ కరీనా కపూర్ లేదా ప్రియాంకా చోప్రాను దించే ఆలోచనలో ఉన్నారట. మరి రంగస్థలం ఈ వార్తలన్ని సినిమా మీద హోప్స్ పెంచుతుండగా ఈ అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: