సునీల్ పరిస్థితి నార్మల్ కి వచ్చేసింది
దీంతో సునీల్ మూవీలకి సైతం మార్కెట్ తగ్గిపోతుందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీని పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ తరువాత సునీల్ మరో క్రేజీ డైరెక్టర్ కాంబినేషన్ లో నటించాల్సి ఉండగా, ఆ ప్రాజెక్ట్ కాస్త అటకెక్కింది. దీంతో యంగ్ డైరెక్టర్స్ అంతా సునీల్ మూవీలకి దూరంగా ఉన్నారు.
ఇటువంటి సమయంలో సునీల్ కథల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటే తప్పితే…తనకు మార్కెట్ లో డిమాండ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ కనిపించటం లేదు. ఓవరాల్ గా చూసుకుంటే గతంలో మార్కెట్ ని కలిగి ఉన్న సునీల్, ప్రస్తుతం నార్మల్ పరిస్థితికి వచ్చేశాడని అంటున్నారు. ఇటువంటి సమయంలో తనకు రెమ్యునరేషన్ విషయంలోనూ కోతలు పడే ఛాన్స్ ఉందని అంటున్నారు.
పూల రంగడు మూవీ సమయంలో… రెమ్యునరేషన్ విషయంలో కచ్ఛితంగా ఉండే సునీల్, ప్రస్తుతం ముందు మూవీ రిలీజ్ అయితే చాలు అన్నట్టుగా రెమ్యునరేషన్ లో అడ్జెస్ట్ మెంట్స్ చేసుకుంటున్నాడనే టాక్స్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి. అయితే సునీల్ మాత్రం తన ప్రెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ మూవీని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదొక చిన్న బడ్జెట్ తరహా చిత్రంగా రావొచ్చనే టాక్స్ వినిపిస్తున్నాయి.