మనీ:సామాన్యులకు గుడ్ న్యూస్.. త్వరలోనే భారత్ రైస్ జియో మార్ట్ లో..!!

Divya
తాజాగా భారత దేశంలో కేంద్ర ప్రభుత్వం భారత రైస్ పేరుతో నాణ్యమైన బియ్యాన్ని సైతం సామాన్య ప్రజలకు అందించే విధంగా కేవలం సబ్సిడీ పైన రూ .29 రూపాయలకే అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టారు. అయితే ఇంత సరసమైన ధరకే సామాన్యులకు అందుబాటులో ఉండే ఈ బియ్యాన్ని తీసుకురావడంతో ఈ బియ్యానికి మంచి డిమాండ్ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఈ బియ్యాన్ని ఆన్లైన్లో ఎలా కొనుగోలు చేసుకోవాలని విషయం పైన చాలా మంది వెతికేస్తూ ఉన్నారు.. పూర్తి వివరాల్లోకి వెళితే .. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ ఇతరత్రా వాటితో 5 లక్షల టన్నుల బియ్యాన్ని సరఫరా చేసేందుకు సిద్ధమయ్యాయి.

ఈ క్రమంలోనే ఏజెన్సీలో ఈ బియ్యాన్ని 5 కిలోలు 10 కిలోల చొప్పున బ్యాగ్ చేసినట్టుగా తెలుస్తోంది. వీటిని అవుట్ లెట్ ద్వారా భారత్ బ్రాండ్ తో సేల్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు అదనంగా ఈ భారత్ రైస్ ను ఈ కామర్స్ ప్లాట్ఫారం ద్వారా కూడా సామాన్యులకు చేరే విధంగా ప్రణాళికలను చేపడుతున్నారు. ముఖ్యంగా అమెజాన్ ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లను వారు కూడా ఆశ్రయిస్తున్నారు.

నిజానికి ప్రస్తుతం భారత్ రైస్ ని ఈ కామర్స్ ప్లాట్ఫారం లో అమ్మడానికి సిద్ధంగా లేదని.. అయితే జియో మార్ట్ వెబ్సైట్లో మాత్రం ఈ జాబితా చేర్చబడినప్పటికీ ఇంకా ఈ బియ్యం ప్రారంభం చేయలేదట.. అయితే ముందుగా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్కత్తా ఇతరత్రా ప్రాంతాలలో ఆర్డర్ డెలివరీ ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే..NAFED అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ విక్రమాలు ఇంకా ప్రారంభం కాలేదని తెలిపారు ఈ భారత్ రైస్ ఆన్లైన్ల ద్వారా విక్రయించేందుకు పలు రకాల సన్నహాలు జరుగుతున్నాయని అది ఎప్పుడు అనే విషయం పైన  ఇంకా క్లారిటీ రాలేదని అధికారులు తెలుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని త్వరలోనే తెలియజేస్తామంటూ తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: