Money: రూ.10 పెట్టుబడితో భారీ ఆదాయం.. ఎలా అంటే.?
ఈ క్రమంలోనే తాజాగా ఆథమ్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక కంపెనీ ప్రధానంగా షేర్లు సెక్యూరిటీలలో పెట్టుబడి వ్యాపారాన్ని ఫైనాన్సింగ్ కార్యకలాపాలను కొనసాగించే ఒక నమోద ఎన్బీఎఫ్సీ.. ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారికి గత మూడు సంవత్సరాల లో స్టెల్లార్ రిటర్న్ లు లభించినట్లు సమాచారం. సెప్టెంబర్ 28 2020 న రూ.10.07 వద్ద ముగిసిన మల్టీబాగర్ ఎన్ బి ఎఫ్ సి స్టాక్ విలువ ప్రస్తుతం బీఎస్ఈ లో రూ.482.60 కి చేరుకుంది. అంటే మూడు సంవత్సరాల కాలం వ్యవధిలోనే ఏకంగా 4,692 శాతం రాబడిని అందించింది అని చెప్పవచ్చు.
అంతేకాదు ఈ స్టాకు ఒక సంవత్సరంలో 106% పెరిగింది. ఇక ఈ సంవత్సరం ప్రారంభం నుండి 118.52 శాతం లాభపడింది అంటే కేవలం 6 నెలల్లోనే ఈ షేర్ 177.28% పెరిగి ఇన్వెస్టర్లకు భారీ ఆదాయాన్ని కలిగించింది. 2023 జూన్ తో ముగిసిన త్రైమాసికంలో 6135 పబ్లిక్ వాటాదారులు 28.53% వాటాను కలిగి ఉన్నారు. వీరిలో 5965 పబ్లిక్ వాటాదారులు 27.25 లక్షల షేర్ లను.. అంటే రూ .2లక్షల వరకు మూలధనంతో 1.60% వాటాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఇందులో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ ఆదాయం రెండు మూడు సంవత్సరాల లోనే భారీగా పెరుగుతుంది అని చెప్పవచ్చు. అయితే ఇందులో ఇన్వెస్ట్ చేసే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం తప్పనిసరి.